Photo Courtesy: JioHotstar

లక్కీ మదన్ రూమ్‌లో ఉండాలో వద్దో రేఖ పిన్నిదే ఫైనల్ డెసిషన్ అని చెబుతాడు రాజ్. చేసేదేం లేక కొడుకుని కొన్ని రోజులు అడ్జెస్ట్ కావాలని రేఖ చెప్పడంతో భ్రమరాంబ, భూషణ్ షాక్ అవుతారు. ఈ రేఖ పాత రేఖ కాదు.. మారిపోయింది, రాజ్ ఏం చెబితే అది చేస్తోందని అనుమానిస్తాడు శేషం. తాను దుగ్గిరాల వారసురాలిని అని, ఇందూ చెల్లెలిని అని నందూ చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. దుగ్గిరాల కుటుంబం గురించి తండ్రి మాటలు గుర్తొచ్చి తన ప్రేమను దాచిపెట్టి బాధగా వెళ్లిపోతాడు వెంకీ.

Advertisement

వీరిద్దరినీ చూసిన ఇందూ.. తన చెల్లెలిని పక్కకి పిలిచి వెంకీని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. దానికి నందూ అవునని సమాధానం చెబుతుంది. వెంకీ అమాయకుడు నువ్వే త్వరగా ప్రపోజ్ చేసేయమని అంటుంది ఇందూ. ఐశ్వర్య కష్టాల్లో ఉందని తెలుసుకున్న ఆమె ఫ్రెండ్.. ఆమెను తన బాయ్‌ఫ్రెండ్‌తో కలపాలని ప్లాన్ చేస్తుంది. డబ్బు మీద ఆశ చూపించి అతనికి దగ్గర చేయాలని మాయమాటలు చెప్పడంతో ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది. లక్కీకి, మదన్‌కి గొడవ జరిగితే రేఖ పిన్ని ఎవరికీ సపోర్ట్ చేయాలో అర్ధం కాక అసలు విషయం చెబుతుందని తన ప్లాన్ చెబుతాడు రాజ్. ఇంతలో నీకు కాబోయే భార్య ఎలా ఉండాలో నాకు చెప్పమని రాజ్‌ని ఇందూ అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 27వ తేదీ ఎపిసోడ్ 1095లో ఇంకా ఏం జరిగిందంటే?

Advertisement