Gundeninda Gudigantalu:'గుండె నిండా గుడి గంటలు' గురువారం ఎపిసోడ్లో చింతామణి మోసం బయటపడిన తర్వాత మీనా ఫైనాన్సర్ సింగరాజుకు డబ్బు తిరిగి చెల్లిస్తుంది. మీనా నిజాయితీని మెచ్చుకున్న సింగరాజు.. ఇకపై పెద్ద ఆర్డర్లు తీసుకోవాలని, అవసరమైనప్పుడు ఆర్థికంగా అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. దీంతో మీనాలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాలు.. మీనాకు ధైర్యం చెబుతాడు. ఇద్దరి మధ్య మల్లెపూలతో అందమైన రొమాంటిక్ సీన్ ఆకట్టుకుంటుంది. మరుసటి రోజు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వేడుకలు జరుగుతాయి. అయితే మీనా విషెస్ చెప్పకపోవడంతో మనోజ్ ఆమెపై విమర్శలు చేస్తాడు. నిజం తెలిసినా తన తప్పును ఒప్పుకోడు. రవి, శృతి, బాలు అతని ప్రవర్తనపై మండిపడతారు.
రవి తీసుకొచ్చిన బర్త్డే కేక్ను కూడా మనోజ్ అవమానించడంతో బాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరోవైపు బాలు స్నేహితుడు రాజేష్ దంపతులు ఇంటికి రావడంతో మీనా ప్రేమగా టిఫిన్ పెడుతుంది. అదే విషయాన్ని రోహిణి మనోజ్కు చెప్పి గొడవకు కారణమవుతుంది. ఇంటికి వచ్చిన అతిథులను అవమానిస్తూ మనోజ్ మాట్లాడటంతో రాజేష్ దంపతులు బాధతో వెళ్లిపోతారు. దీంతో బాలు, శృతి, మీనా మనోజ్పై తీవ్రంగా విరుచుకుపడతారు. కోపంతో బాలు మనోజ్కు బలవంతంగా టిఫిన్ తినిపించేందుకు ప్రయత్నించడంతో ఇంట్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గొడవ తర్వాత ప్రభావతి ఎవరికి మద్దతు ఇస్తుంది? రోహిణి మరో కుట్ర పన్నుతుందా? అన్న ఆసక్తితో ఎపిసోడ్ ముగిసింది.
Photo courtesy: Jio hotstarMore Articles