Photo Courtesy: JioHotstar
యాక్సిడెంట్లో దెబ్బలు తగలడంతో మెడకు బెల్ట్ వేయించుకుంటుంది పారు. కారుకు బ్రేక్లు పడక యాక్సిడెంట్ అయ్యింది.. అయినా నీ ముఖానికి ఆయిల్ ఏంటీ అని కార్తీక్ అడగ్గా గేట్ క్లీన్ చేస్తుంటే అయ్యిందని చెబుతుంది పారు. బ్రదర్ని చంపడానికి ఏదైనా కుట్ర జరిగిందా? అని కార్తీక్ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. శివన్నారాయణ కుటుంబం మొత్తం కలిసి రెస్టారెంట్స్ మధ్య జరిగే పోటీకి వెళ్తారు. అక్కడికి మాలిని, దక్షిణామూర్తి రావడంతో శివన్నారాయణ రగిలిపోతాడు. మనిద్దరికీ ఎలాంటి పరిచయం లేదని అంతా అనుకుంటున్నారు. దానిని అలాగే ఉండనివ్వమని చెబుతాడు శివన్నారాయణ.
కుటుంబాన్ని విడదీశారు ఇప్పుడు మనుషుల్ని కూడా విడదీస్తారా అని మండిపడుతుంది సుమిత్ర. ఇంతలో పోటీకి సంబంధించిన రూల్స్ చెబుతారు అసోసియేషన్ వాళ్లు. గంటలో 5 రకాల వెరైటీలు చేయాలని, అసోసియేషన్ నిర్ణయించిన జడ్జిలు ఎవరి ఫుడ్ బాగుందో నిర్ణయిస్తారని చెబుతారు. దీప, సూరజ్ల మీద తాతకున్న నమ్మకాన్ని చంపేయాలని పారు, జ్యోత్స్నలు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మాలిని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండగా ఆమె ఉంగరం కింద పడిపోతుంది. అది చూసిన సూరజ్ ఆమెకు ఇస్తాడు. ఇదే సమయంలో మాలినికి సూరజ్ అమ్ముడుపోయాడని నమ్మించాలని జ్యోత్స్న ప్లాన్ చేసి శివన్నారాయణని బయటికి రప్పిస్తుంది. మాలినికి సూరజ్ కౌంటర్ ఇవ్వడం చూసి పెద్దాయన మెచ్చుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి జూలై 17వ తేదీ 725వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?
Photo Courtesy: JioHotstarMore Articles