Recommended Video
అగ్ర హీరోయిన్లు ఐటమ్, స్పెషల్ సాంగ్లో నర్తించడం చాలా సాధారణమైంది. గతంలో కాజోల్ తదితరులు స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తాజాగా మరోసారి తమన్నా భాటియా సవ్యసాచి చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాటకు నాగచైతన్యతో కలిసి స్టెప్పులు వేయబోతున్నారు.
90 దశకంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు అనే పాటకు తమన్నా డ్యాన్స్ వేయబోతున్నారు.
ఈ పాటను రీమిక్స్ చేసి తొలుత నాగార్జున, నిధి అగర్వాల్పై చిత్రీకరించాలని భావించారు. కానీ తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించగా ఒకే చెప్పింది. ఈ పాట కోసం తమన్నా బిజీ షెడ్యూల్లో మార్పులు చేసుకొని స్టెప్పులేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు మాధవన్, భూమిక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.