Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మోసగాడు సుఖేష్ కోసం 12 మంది హీరోయిన్స్.. ఏకంగా జైలుకు వెళ్లి మరీ.. నెలకు కోటి రూపాయలతో అలా!
సుకేష్ చంద్రశేఖర్ మరియు అతని భార్య నటి లీనా మారియా పాల్ను ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అరెస్టు చేసింది. జైలు నుంచి రికవరీ రాకెట్ నడుపుతున్నందుకు అతడిపై ఈ చర్య తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే
డబ్బు బలంతో తీహార్ జైలు సిబ్బందిని
సినీ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలను విచారించిన తర్వాత కోటీశ్వరుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. ఇది చాలా షాకింగ్ గా ఉంది. ఢిల్లీలో తీహార్ జైల్లో సుకేష్ ఒక సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేశారని తెలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ డబ్బు బలంతో తీహార్ జైలు సిబ్బందిని కొనుగోలు చేశాడని, అతను పూర్తిగా తనకు నచ్చినట్టు జైలులో జీవించాడని తెలుస్తోంది.
ప్రతి నెలా కోటి రూపాయల లంచం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్18 పెద్ద సంచలన విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం తీహార్ జైలు అధికారులకు సుకేష్ చంద్రశేఖర్ ప్రతి నెలా కోటి రూపాయల లంచం ఇస్తుండేవాడని, విలాసవంతమైన సౌకర్యాలు పొందడానికి ఈ లంచం ఇచ్చాడట. బదులుగా, అతను ఎటువంటి పరిమితులు లేకుండా తన మహిళా అతిథులను కలవడానికి అనుమతించబడ్డారట.
12 మంది జైలులో సుకేష్ను
200 కోట్ల మనీలాండరింగ్తో పాటు సుకేష్పై ఇంకా చాలా కేసులు ఉన్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు నోరా ఫతేహితో పాటు, దుండగుడిని అనేక మంది మోడల్స్ మరియు బాలీవుడ్ నటీమణులు జైలులో కలిశారని వర్గాలు తెలిపాయి. అలాంటి నటీమణులు కనీసం 12 మంది జైలులో సుకేష్ను కలవడానికి వెళ్లారని తెలుస్తోంది
జైలు సిబ్బంది వేధింపులకు
గతంలో మనీలాండరింగ్, ఇతర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న తీహార్ జైలు అడ్మినిస్ట్రేషన్ సుకేష్పై తీహార్ జైలు సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జైలు అధికారులు తనను ఇతర ఖైదీలతో సంభాషించడానికి అనుమతించడం లేదని దీంతో మానసికంగా కుంగిపోతున్నానని, జైలులో తనకు టీవీ అవసరమని, వారానికి ఒకసారి తన భార్యను కలవాలని కోరిన కానీ, జైలు అధికారులు అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు.
కంప్లైంట్ నోట్
దీనికి సంబంధించి పాటియాలా హౌస్ కోర్టులో ఆయన కంప్లైంట్ నోట్ కూడా దాఖలు చేశారు. 'నన్ను మానసికంగా వేధిస్తున్నారని, ఈ విషయమై త్వరలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తానని ఆ నోట్లో పేర్కొన్నాడు. నేను ఇప్పటికే జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను మరియు నేను చాలా బాధపడ్డాను. నన్ను జైలు నిర్వాహకులు సిసి కెమెరాల సహాయంతో పర్యవేక్షిస్తున్నారని, అసలు నాతో ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని సుకేష్ పేర్కొన్నాడు.
మాన్యువల్ ప్రకారం
తనకు భయంగా ఉందని, ఒకే తాళం ఉన్న తలుపు లోపల ఉంచేలా జైలు అధికారులను ఆదేశించాలని సుకేష్ చెప్పాడు. జైలులో ఉన్న ప్రతి ఖైదీకి టీవీ సెట్ను అందించారు కానీ అతనికి ఈ సౌకర్యం కల్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జైలు మానసిక వైద్యుడు తనను తాను బిజీగా ఉండమని కోరినట్లు ఆయన తెలిపారు. నేను నా భార్య లీనా మరియా పాల్ని కలవాలనుకుంటున్నాను, జైలు మాన్యువల్ ప్రకారం అనుమతి ఉంది అని సుకేష్ కొరారు.