సల్మాన్, షారుఖ్ ఫైట్ కోసం ఊహించని బడ్జెట్.. ఆ ఖర్చుతో మీడియం రేంజ్ సినిమా తియొచ్చు..
గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఒక్క సినిమా కూడా హిట్టు కావట్లేదు. ఇలాంటి సమయంలోనే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఆశలు చిగురించేలా చేశాడు. ఆ సినిమా హిట్టుగా నిలిచినా ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఫట్టుమన్నాయి ఇటీవల విడుదలైన సల్మాన్ సినిమా కిసీ కా భాయి కిసీ కా జాన్ కూడా ఫ్లాప్ గా నిలవడంతో.. ఆశలన్నీ టైగర్-3 చిత్రంపైనే ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్-3. అయితే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల మధ్య ఓ అదిరిపోయే యాక్షన్ సీన్ పెడుతున్నారు. అయితే ఈ అదిరిపోయే సీన్ కోసం ఏకంగా రూ.35 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. దీంతో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఖర్చుతో మీడియం రేంజ్ హీరో సినిమా తీయవచ్చు అని అంటున్నారు.

జైల్ లో కొనసాగే సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను రూపొందిస్తున్నారట. సల్మాన్, షారుఖ్ ఇద్దరూ ఈ సినిమాలో భాగం అవుతారట. మే 8వ తేదీ నుంచి ఈ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారంటే విపరీతమైన బజ్ ఏర్పడుతుందని... వారి స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొని అదిరిపోయే సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న టైగర్-3లో కత్రినా కైఫ్.. జోయా పాత్రలో నటించింది. అయితే ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ఇతను ఓ ఐఎస్ఐ ఏజెంట్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

టైగర్ 3 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది దీపావళికి అంటే నవంబర్ 10వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా పరాజయాలు అందుకుంటున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతోనైనా హిట్టు కొడతారో లేదో చూడాలి మరి. ఈ ఏడాది షారుఖ్ నటించిన పఠాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు. మరోసారి టైగర్ కోసం పఠాన్ అతిధి పాత్రలో మెరవడనుండటంతో సినిమాపై బజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











