Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమీర్ ఖాన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు... సైఫ్ అలీ ఖాన్తో కలిసి సౌత్ మూవీ రీమేక్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' భారీ ప్లాప్ తర్వాత ఆచితూచి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 'లాల్ సింగ్ చద్దా' బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్. ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం.
తమిళ హిట్ మూవీ 'విక్రమ్ వేద' హిందీలో రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో నటించడానికి అమీర్ ఖాన్ అంగీకారం తెలిపారని, అక్కడ కూడా ఇదే పేరుతో దీన్ని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో అమీర్ ఖాన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు టాక్.
ఇందులో అమీర్ ఖాన్తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా లీడ్ రోల్ చేయబోతున్నారు. సైఫ్ ఇందులో మంచి పోలీస్గా కనిపిస్తారట. తమిళంలో దర్శకత్వంలో వహించిన గాయిత్రి పెష్కర్ హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నట్లు సమాచారం. 2020 మార్చిలో దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో 'విక్రమ్ వేద' తెరకెక్కింది. హిందీలో విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్, మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. ఈ చిత్రాన్ని నీరజ్ పాండే నిర్మిచబోతున్నారు.