Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'మహాభారతం' కోసం క్రేజీ చిత్రాన్ని వదులుకున్న అమిర్ ఖాన్.. షారుఖ్ చేతుల్లో!
బాలీవుడ్ లో ఆసక్తికరమైన బయోపిక్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. అమిర్ ఖాన్ నటించిన భారీ చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ ప్రముఖ రచయిత అంజుమ్ రాజబాలి అమిర్ ఖాన్ కోసం ఓ కథ సిద్ధం చేశారు. స్పేస్ లో అడుగు పెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఈ కథని సిద్ధం చేశారు.సారె జహాన్ సే అచ్చా పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని అమిర్ రిజెక్ట్ చేయడంతో రచయిత నిరాశకు లోనయ్యారు. ఆ విషయంపై అమిర్ ఖాన్ తాజగా స్పందించారు.
రాకేష్ శర్మకు అభిమానిని
అమిర్ ఖాన్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. సారె జహాన్ సే అచ్చా అనేది అద్భుతమైన కథ. నేను వ్యక్తిగతంగా రాకేష్ శర్మకు అభిమానిని. ఆ సమయంలో నేను ఈ చిత్రాన్ని చేయలేనని భావించి నో చెప్పానని అమిర్ అభిప్రాయ పడ్డాడు. ఈ చిత్ర రచయిత అంజుమ్ రాజబాలి, షారుఖ్ ఖాన్ ఇద్దరూ నాకు మంచి సన్నిహితులు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉందని అమిర్ తెలిపారు.
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ఫెయిల్యూర్... ప్రేక్షకులకు అమీర్ ఖాన్ క్షమాపణలు!
మహాభారతం కోసం
రచయిత అంజుమ్ రాజబాలి మాట్లాడుతూ.. తాను మొదట ఈ చిత్రంలో అమిర్ ఖాన్ నటించాలని భావించా. అమిర్ కథ విని బావుందని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. కథకు సంబంధించి చర్చలు, తీవ్రమైన కసరత్తులు జరిగాయి. కానీ అదే సమయంలో అమిర్ ఖాన్ కు మహాభారతం ప్రపోజల్ రావడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని రాజబాలి తెలిపారు.
ఫిబ్రవరి నుంచి
సారె జహాన్ సె అచ్చా చిత్రం ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ఈ చిత్రం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్ అన్నట్లుగానే తాను కూడా రాకేశ్ శర్మకు అభిమానిని అని రాజబాలి తెలిపారు. స్పేస్ థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ క్రమంగా ఇండియన్ సినిమాలో పెరుగుతోంది.
అక్షయ్ కుమార్ కుడా
ఇటీవలే స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా మిషన్ మంగళ్ చిత్రాన్ని ప్రకటించాడు. ఫాక్స్ స్టూడియోస్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ రెండు చిత్రాలకు ఏమైనా పోలిక ఉంటుందని ఆందోళనగా ఉందా అనే ప్రశ్నకు రాజబాలి స్పందించారు. మిషన్ మంగళ్ అనే చిత్రం ఇండియా మార్స్ మిషన్ మంగళ్ యాన్ ఆధారంగా తెరకెక్కుతోంది. తమ చిత్రం ఓ వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందబోతోందని రాజబాలి క్లారిటీ ఇచ్చారు.