Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సోషల్ మీడియాకు అమీర్ ఖాన్ గుడ్బై.. ఫ్యాన్స్కు షాకిచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అభిమానులకు భారీ షాకిచ్చాడు. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన తన నిర్ణయాన్ని అభిమానులతో పంచుకొన్నారు. ఇటీవల పుట్టిన రోజు జరుపుకొన్న అమీర్ ఖాన్కు తన అభిమానులు శుభాకాంక్షలతో వెల్లువెత్తారు. ఈ సందర్భంగా తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ చివరి సందేశాన్ని అందించారు.
నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. గత కొన్నేళ్లుగా నాకు అందించిన ప్రేమకు, సపోర్ట్కు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. నా హృదయం ప్రేమతో నిండిపోయింది. సోషల్ మీడియాలో ఇదే చివరి పోస్టు. ఎప్పటిలానే మీతో యాక్టివ్గా ఉంటాను. ఇంతకు ముందు మాదిరిగానే నేను మీతో కమ్యూనికేట్ చేస్తుంటాను అని తన పోస్టులో తెలిపారు. తన పనిమీదే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించడానికి ఈ నిర్ణయం తీసుకొంటున్నట్టు వెల్లడించారు.
అమీర్ ఖాన్ సోషల్ మీడియా ప్రయాణం గురించిన వివరాల్లోకి వెళితే... 11 ఏళ్ల క్రితం ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశారు. గత మూడేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశించారు. తాజాగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను షాక్ గురి చేసింది.
ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటిస్తున్్నారు. కరీనా కపూర్, ఎల్లీ అవ్రామ్ తదితరులు నటిస్తున్నారు.