Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాకింగ్ విషయాలు బయటపెట్టిన అమీర్ ఖాన్.. గుడ్ బై చెబుతున్నానంటే ఎమోషనల్.. విని ఏడ్చిందంటూ!
బాలీవుడ్ బడా హీరోల్లో ఒకరు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. మంచి కథలను ఎంచుకుంటూ మంచి హిట్ లు కొడుతూ ఉంటారు. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్న ఆయన తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పే విషయం మీద మాట్లాడారు. ఆ వివరాలు
సమయం గడపడం లేదని
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇటీవల ఒక ఈవెంట్లో తన ఆత్మపరిశీలన గురించి మాట్లాడాడు. సినిమా కారణంగా అందరిలాగే తాను కూడా తన జీవితంలో చాలా కోల్పోయానని, అయితే కరోనా మహమ్మారి సమయంలో తాను కూడా చాలా సంపాదించానని అమీర్ ఖాన్ అన్నారు. గతేడాది అమీర్ తన భార్య కిరణ్రావుతో విడిపోయాడు. అదే సమయంలో, గత రెండేళ్లుగా తన కెరీర్లో ఇక సమయం వచ్చిందని, అది తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, సినిమాలను విడిచిపెట్టాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తన శక్తినంతా తన పనికే వెచ్చిస్తున్నానని, కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో తగినంత సమయం గడపడం లేదని అర్ధ అయినందుకే బాలీవుడ్ నుంచి తప్పుకోవాలని భావించినట్లు అమీర్ ఖాన్ వెల్లడించారు.
ఏమీ చేయలేనని
నేను నటుడిగా మారిన తర్వాత నా కుటుంబాన్ని పెద్దగా భావించానని అన్నారు. ప్రేక్షకుల మనసు దోచుకునే యాత్ర సాగించానని ఆయన అన్నారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేదని, అయితే 30-35 ఏళ్లుగా ఇలాగే పనిచేస్తున్నానని, దీంతో కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయానని చెప్పాడు. నేను స్వార్థపరుడినని, నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని ఆయన అమీర్ ఖాన్ పేర్కొన్నారు. నేను నా పిల్లలతో ఉన్నాను, కానీ ఉండవలసిన విధంగా కాదు. నేను ఇప్పుడు 56-57 సంవత్సరాల వయస్సులో ఈ విషయాన్ని గ్రహించాను. కానీ అదే మంచిది అయింది. ఎందుకంటే నేను 86 సంవత్సరాల వయస్సులో దీనిని గ్రహించినట్లయితే, నేను ఏమీ చేయలేనని అన్నారు. ప్రస్తుతానికి నేను దాన్ని పరిష్కరించగలను. కానీ పెద్ద సమస్య ఏమిటంటే, నా పిల్లలకు ఏమి కావాలో నాకు తెలియదు.
విని ఏడ్చింది
ఈ విషయం తెలుసుకున్న నాకు చాలా కోపం వచ్చి సినిమాకి వెళ్లాను అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా నన్ను నా కుటుంబం నుంచి దూరం చేసిందని భావించాను అని ఖాన్ అన్నారు. ఇకపై నేను నటించనని, సినిమాలు నిర్మించనని, మీతోనే ఉంటానని మా కుటుంబ సభ్యులకు చెప్పాను. ఈ విషయం తెలిసి నా కుటుంబం షాక్కు గురైందని అన్నారు. నా తదుపరి చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ని ప్రమోట్ చేయడానికి కొందరు ఇదో మార్గంగా భావిస్తారని నేను మొదట్లో సినిమా నుండి నిష్క్రమించాలనే నా ఆలోచన గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. నేను తప్పు చేస్తున్నానని నా పిల్లలు, కిరణ్ కూడా నాకు వివరించారని ఖాన్ అన్నారు. కిరణ్ చాలా ఎమోషనల్ అయ్యి నా నిర్ణయం విని ఏడ్చింది. తనకు సినిమా అంటే ఇష్టమని, సినిమా లేకుండా నన్ను ఊహించుకోలేనని ఆమె చెప్పింది అని అమీర్ చెప్పుకొచ్చారు.
Recommended Video
ఆగస్ట్ 11న థియేటర్లలో
గత
రెండేళ్లలో
నేను
ఆలోచించుకోవడానికి
చాలా
సమయం
దొరికిందని,
చాలా
ఆత్మపరిశీలన
చేసుకున్నానని
అమీర్
ఖాన్
అన్నారు.
18
ఏళ్ల
వయసులో
మామయ్య
దగ్గర
అసిస్టెంట్
డైరెక్టర్గా
పని
చేయడం
మొదలుపెట్టాను.
అదే
సమయంలో,
ఇప్పుడు
నేను
మద్యం
సేవించడం
మానేశానని
అన్నారు.
తన
పిల్లల
కలలు,
ఆశలు,
ఆందోళనలు
మరియు
భయాలు
తనకు
తెలియవని,
అయితే
అశుతోష్
గోవారికర్,
రాజు
హిరానీ
వంటి
వారి
వల్ల
ఆ
విషయాలు
తెలుసని
నటుడు
వెల్లడించారు.
దీంతో
కుటుంబానికి
సరైన
సమయం
ఇవ్వలేదని
అర్థమైందని
అన్నారు.
సినిమాల
విషయానికి
వస్తే
అమీర్
ఖాన్
త్వరలో
టామ్
ఫారెస్ట్
గంప్
కి
అధికారిక
హిందీ
రీమేక్
లాల్
సింగ్
చద్దాలో
కనిపించనున్నారు.
ఈ
చిత్రానికి
సంబంధించిన
వివరాలను
తెలియజేస్తూ,
ఈ
చిత్రానికి
సంబంధించిన
పూర్తి
పనుల్లో
బిజీగా
ఉన్నానని
అమీర్
తెలిపారు.
అద్వైత్
చందన్
దర్శకత్వం
వహించిన
లాల్
సింగ్
చద్దా
ఆగస్ట్
11న
థియేటర్లలో
విడుదల
కానుంది.
ఈ
సినిమాలో
నాగచైతన్య
కూడా
కీలక
పాత్రలలో
నటిస్తున్నారు.