Don't Miss!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అర్జున్ రాంపాల్కు మళ్లీ సమన్లు.. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ మరోసారి పంజా
బాలీవుడ్తో సంబంధమున్న డ్రగ్స్ రాకెట్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరోసారి పంజా విసిరింది. ఇప్పటికే ఓసారి అర్జున్ రాంపాల్ను విచారించిన అధికారులు మరోసారి ఆయనకు సమన్లు జారీ చేశారు. డ్రగ్స్ సంబంధమున్న కేసులో విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు.
గతంలో నవంబర్ 8 తేదిన అర్జున్ రాంపాల్ ఇంటిలో మెరుపుదాడులు నిర్వహించారు. దాడుల అనంతరం ఆయన ఇంటి నుంచి కొంత మేరకు డ్రగ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు. అదే రోజున అర్జున్ రాంపాల్ ప్రియురాలు గ్యాబ్రిల్లా డెమిట్రియాడెస్ను ఆరు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన అర్జున్ రాంపాల్ను విచారించారు.
అర్జున్ రాంపాల్ ఇంటిపై దాడులు నిర్వహించిన తర్వాత తన స్నేహితుడు పాల్ బార్టెల్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పాల్ను విచారిస్తున్న క్రమంలో మళ్లీ అర్జున్ రాంపాల్కు సమన్లు జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.