Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కనీవినీ ఎరుగని రీతిలో సాహో, తెరపై అద్భుతం చూడబోతున్నాం: జాకీ ష్రాఫ్
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ 'సాహో'. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఓ తెలుగు ఛానల్తో మాట్లాడుతూ సాహో గురించి విశేషాలు పంచుకున్నారు.
బాహుబలి ప్రభాస్ ఏం చేశాడో దేశ ప్రజలందరికీ తెలుసు. 'సాహో'లో ప్రభాస్ మరింత గొప్పగా కనిపిస్తాడు. దర్శకుడు సుజీత్ చిన్నవాడైనా చాలా తెలివిగల వాడు. తక్కువ మాట్లాడతాడు, తన పని మీదే ఎక్కువ ఫోకస్ పెడతాడు. తన టీమ్ను చాలా అద్భుతంగా గైడ్ చేస్తున్నాడని... జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు.
'సాహో' చిత్రానికి కెమెరా పర్సన్ అద్భుతంగా పని చేస్తున్నాడు. టెక్నీషియన్లంతా ఏ గ్రేడ్. ప్రభాస్ ప్రతి విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా పరిశ్రమలో చూడని అద్భుతమైన యాక్షన్ 'సాహో'లో చూడబోతున్నాం. కెమెరా టీం అద్భుతాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
'సాహో' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యూవి క్రియేషన్స్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్గా శద్ధా కపూర్ పుట్టినరోజు (మార్చి 3) సందర్భంగా 'షేడ్స్ ఆఫ్ సాహో - 2' విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
'సాహో' ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.