Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Book My Show పై నిప్పులు చెరిగిన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్ (పెటా) ఇండియాకు సేవలు అందిస్తున్నారు. అయితే సర్కస్లో జంతువులను హింసించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్కస్ షోల కోసం బుక్ మై షో టికెట్ల అమ్మకాలను కొనసాగిస్తున్నది. అయితే జంతువులను హింసిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచడం తప్పు అంటూ బుక్మైషో సీఈవోకు ఘాటుగా లేఖ రాశారు. జంతురహిత వినోదాన్ని అందించాలని ఆయన లేఖలో సూచించారు.
పెటాకు మాజీ పర్సన్ ఆఫ్ ఇయర్గా వ్యవహరించారు. అయితే దేశంలో పలు ప్రాంతాల్లో సర్కస్ నిర్వహిస్తున్న రాంబో సర్కస్లో జంతువులను బాధించడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇటీవలే పూణెలో ఈ సర్కస్ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలైన విషయాన్ని తెలిపారు.
రాంబో సర్కస్లో కుక్కలను హింసించి వాటితో వినోదాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ సర్కస్కు సంబంధించిన టికెట్లను బుక్మైషో వెబ్సైట్లో అమ్మకూడదని సీఈవో ఆశీష్ హెమ్రంజానీని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా సర్కస్ కంపెనీలు మానవులతోనే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. జంతువులను కేవలం అలంకార వస్తువులుగా వాడుకొంటున్నారు. జంతువులకు, మూగ జీవాలకు హాని తలపెట్టకుండా వినోదాన్ని అందిస్తున్నారు. కొన్నిసార్లు జంతువులు వినకపోతే వాటిని దారుణంగా శిక్షిస్తున్నారు. ఇలాంటి సర్కస్ కంపెనీలను ప్రోత్సహించకూడదు అని జాన్ అబ్రహం తన లేఖలో పేర్కొన్నారు.