Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వణికిపోతూనే లిప్లాక్.. మూడు రోజులపాటు ఏకధాటిగా ముద్దులే ముద్దులు
బాలీవుడ్లో 90వ దశకంలో రిలీజైన రాజా హిందూస్థానీ చిత్రం కుర్రకారును ఉర్రూతలూగించడమే కాకుండా ఎంతటి ప్రభంజాన్ని సృష్టించిందే అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య కెమిస్ట్రీ యువతకు గిలిగింతలు పెట్టింది. 1990లో అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రాజా హిందూస్థానీ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆ చిత్రంలో రొమాంటిక్ విషయాలను తాజాగా హీరోయిన్ కరిష్మా కపూర్ మీడియాతో పంచుకొన్నది. వివరాల్లోకి వెళితే..
వెబ్ సిరీస్లో కరిష్మా కపూర్
ప్రస్తుతం కరీష్మా కపూర్ జీ 5 ఓటీటీ ఫ్లాట్ఫాంలో మెంటల్హుడ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నది. ఆ వెబ్ చిత్రం ప్రమోషన్ సందర్భంగా రాజా హిందుస్థానీ సినిమాలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొన్నది. కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించడానికి చాలా ఇబ్బందికి గురయ్యాం అని కరిష్మా కపూర్ తమ అనుభవాలను వెల్లడించింది.
మంచి చలికాలంలో ఊటీలో షూట్
రాజా హిందూస్థానీ సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది. ఫిబ్రవరి మాసం కావడంతో గడ్డ కట్టేంత చలి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ చేశాం. ఆ చిత్రంలోని లిప్లాక్ సీన్ కోసం చాలా కష్టపడ్డాం. దాదాపు మూడు రోజులపాటు ఆ సీన్ను చిత్రీకరించారు.ఆ ముద్దు సీన్ ఎప్పుడు అయిపోతుందో అని మాకు అనిపించేది అని కరిష్మా కపూర్ తెలిపారు.
గడ్డకట్టేంతగా చలిగాలులు
షూటింగ్ సమయాల్లో గడ్డ కట్టేంత చలిగాలి, నీళ్లు మంచు ముద్దలా మారే పరిస్థితి. విపరీతమైన చలి కారణంగా ప్రతీ టేక్లో అమీర్ ఖాన్, నేను వణికిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ముద్దు సీన్లో నటిస్తూనే ఉన్నాం అని కరిష్మా కపూర్ పేర్కొన్నారు.
Recommended Video
పెళ్లి, విడాకుల తర్వాత రీ ఎంట్రీ
బాలీవుడ్లో కెరీర్ పీక్లో ఉండగానే కరిష్మా కపూర్ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత భర్తతో విడిపోయిన తర్వాత చాలా కాలం ఒంటరిగానే ఉంది. 2012లో డేంజరస్ ఇష్క్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్లపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం కూతురు సమీరా, కుమారుడు కియాన్తో జీవితం వెళ్లదీస్తున్నది.