Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమీషా పటేల్ మీద చీటింగ్ కేసు నమోదు
పవన్ కళ్యాణ్ మూవీ 'బద్రి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమీషా పటేల్ అవకాశాలు తగ్గి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆమెపై చీటింగ్ కేసు నమోదు కావడంతో మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అమీషా మీద లా సూట్ దాఖలు చేసింది. ఓ పెళ్లి వేడుకలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తానని డబ్బులు తీసుకున్న అమీషా తమను మోసం చేసినట్లు కేసు వేశారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్కు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అమీషా పటేల్తో పెళ్లి వేడుకలో నృత్య ప్రదర్శన చేయడానికిగాను నవంబర్ 2016లో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఆమెకు రూ. 11 లక్షలు చెల్లించారు.
అమీషా పటేల్ తన బృందంతో కలిసి వచ్చి నృత్య ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా... అదనంగా మరో రూ. 2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకుడు పవన్ శర్మ అంగీకరించక పోవడంతో ప్రదర్శన ఇవ్వకుండానే అమీషా పటేల్ ముంబై వెళ్లిపోయింది.
దీని వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే తమను బెదిరిస్తోందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు అమీషాతో పాటు మరో నలుగురిపై కేసు నమెదు చేశారు. మార్చి 12లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.