Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాలీవుడ్లోకి మరో బాలీవుడ్ నటి.. దీపిక, ప్రియాంక చోప్రా దారిలో..
బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి కెరీర్లో మరో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. ఇప్పటికే హాలీవుడ్ గడప తొక్కిన దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా బాటలో నడువనున్నారు. త్వరలోనే హాలీవుడ్లో హ్యుమా ఎంట్రీ ఇవ్వనున్నారు జాక్ స్నైడర్ రూపొందించే ఆర్మీ ఆఫ్ ది డెడ్ అనే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఆమె మీడియాతో పంచుకొన్నారు. హాలీవుడ్ ఎంట్రీ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా హ్యూమా ఖురేషి మాట్లాడుతూ.. సినిమా కోసం అగ్రిమెంట్ చేసినందున్న మూవీ లేదా క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పలేను. కానీ ఈ హ్యాపీ మూమెంట్స్ను మాత్రం షేర్ చేసుకొంటాం అని అన్నారు. ప్రముఖ దర్శకుడు జాక్ స్నైడర్ తరహాలోనే సినిమా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను అని అన్నారు.
భావోద్వేగాలకు అనుగుణంగా నటించే యాక్టర్ను. మూస పాత్రల్లో నటించలేను. ప్రస్తుతం ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఈ సినిమా కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నాను. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుంది అని హ్యుమా ఖురేషి చెప్పారు.
2012లో అనురాగ్ కశ్యప్ రూపొందించిన గ్యాంగ్స్ వాస్సేపూర్ చిత్రంలో నటించడం ద్వారా ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దేడ్ ఇష్కియా, ఏక్ థి దయాన్ చిత్రాల్లో నటించారు. అలాగే దక్షిణాదిలో సూపర్ స్టార్ రజనీకాంత్తో రొమాన్స్ చేశారు. తాజాగా హాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అడుగులేస్తున్నారు.