Don't Miss!
- Finance Bitcoin Crash: భారీగా పతనమైన బిట్కాయిన్.. ఇండియాకి బినాన్స్ తిరిగి ఎంట్రీ..
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ కోసం ‘ఆదిపురుష్’ ప్లాన్ ఛేంజ్: వాళ్లందరి డేట్స్ మార్చేసి మరీ షూట్
టాలీవుడ్లో ఇంత కాలం హవాను చూపించి.. ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేయడానికి రెడీ అయిపోయాడు పాన్ ఇండియా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కొన్నేళ్లుగా వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. ప్రస్తుతం నేరుగా 'ఆదిపురుష్' అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. రామాయణం నాటి కథతో, చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాను చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. గత ఏడాది మొదలైన ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ఇటీవలే ముంబైలో పున: ప్రారంభం అయింది. ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్లో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా రావణుడిగా నటిస్తోన్న సైఫ్ అలీ ఖాన్ మీద సోలో సీన్స్ను షూట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వాస్తవానికి ఈ షెడ్యూల్లో ప్రభాస్ కూడా భాగం అవ్వాలట. కానీ, అనివార్య కారణాల వల్ల అది వీలుకాలేదని తెలిసింది. దీంతో మిగిలిన నటీనటుల కాల్షీట్స్ను మార్పులు చేసి మరీ షూట్ కొనసాగిస్తున్నారట. అంటే ప్రభాస్ కోసం చాలా మంది యాక్టర్ల డేట్స్ మార్చుకోవాల్సి వచ్చిందన్న మాట.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతుంది.