Don't Miss!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ముఖం చాటేసిన డైరెక్టర్.. హీరోయిన్తో పెళ్లి తర్వాత అజ్ఞాతంలోకి.. ఏం జరిగిందంటే..
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్య చోప్రా ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాడు. యష్రాజ్ ఫిలింస్ బ్యానర్పై చిత్రాలను నిర్మిస్తూ దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. హీరోయిన్ రాణి ముఖర్జీతో వివాహం తర్వాత మీడియాకు, అటు సినీ సెలబ్రిటీలకు ముఖం చాటేస్తున్నాడు. బాలీవుడ్లో పెద్ద ప్రొడక్షన్ హౌస్కు అధినేత అయిన ఆదిత్య చోప్రా ఇటీవల మీడియా కంటపడ్డారు. అసలేం జరుగుతున్నందంటే..
రాణి ముఖర్జితో వివాహం తర్వాత
రాణి ముఖర్జితో వివాహం తర్వాత ఆదిత్య చోప్రా దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కారణం ఏమిటో తెలియదు గానీ.. బాలీవుడ్ పార్టీలకు, ప్రముఖులతో సమావేశాల్లో కానవచ్చే పరిస్థితి లేదు. బాలీవుడ్లో సర్వాంతర్యామి అనే పేరు తెచ్చుకొన్న ఆదిత్య చోప్రా పరిస్థితి అర్థం కాకుండా తయారైంది.
రాణి ముఖర్జీకి సమస్యలు
ఆదిత్య చోప్రా ప్రవర్తనతో రాణి ముఖర్జీకి అనేక సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదిత్య చోప్రాకు ఇతర సెలబ్రిటీల్లా ఫోటోలు తీసుకోవడం ఇష్టం ఉండదు అని రాణి చెప్పారు. ఇలా చాలాసార్లు మీడియాకు రాణి సమాధానం చెప్పుకోవాల్సిన సమస్య ఎదురైంది. తనకు శిష్యుడి లాంటి కరణ్ జోహర్కు కూడా అందుబాటులోకి లేకుండా ఉంటున్నాడు.
సెలబ్రిటీ పార్టీకి ఆదిత్య చోప్రా
తాజాగా వారాంతంలో ఆదిత్య చోప్రా ముంబైలోని ఓ పాపులర్ క్లబ్లో పార్టీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ఆయనను బంధించడానికి ప్రయత్నించగా, అతడు కెమెరాలకు ముఖం చాటేశాడు. చాలా రోజుల తర్వాత సెలబ్రిటీ పార్టీలకు హాజరుకావడం చర్చనీయాంశమైంది.
యష్ రాజ్ బ్యానర్పై వరుస చిత్రాలతో
ఆదిత్య చోప్రా మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ.. నిర్మాణ రంగంలో బిజీగా కనిపిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో చోటా భీమ్: కుంగ్ ఫు ధమాకా, హృతిక్ వర్సెస్ టైగర్, మర్దానీ2, సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.