Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ముఖం చాటేసిన డైరెక్టర్.. హీరోయిన్తో పెళ్లి తర్వాత అజ్ఞాతంలోకి.. ఏం జరిగిందంటే..
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్య చోప్రా ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాడు. యష్రాజ్ ఫిలింస్ బ్యానర్పై చిత్రాలను నిర్మిస్తూ దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. హీరోయిన్ రాణి ముఖర్జీతో వివాహం తర్వాత మీడియాకు, అటు సినీ సెలబ్రిటీలకు ముఖం చాటేస్తున్నాడు. బాలీవుడ్లో పెద్ద ప్రొడక్షన్ హౌస్కు అధినేత అయిన ఆదిత్య చోప్రా ఇటీవల మీడియా కంటపడ్డారు. అసలేం జరుగుతున్నందంటే..
రాణి ముఖర్జితో వివాహం తర్వాత
రాణి ముఖర్జితో వివాహం తర్వాత ఆదిత్య చోప్రా దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కారణం ఏమిటో తెలియదు గానీ.. బాలీవుడ్ పార్టీలకు, ప్రముఖులతో సమావేశాల్లో కానవచ్చే పరిస్థితి లేదు. బాలీవుడ్లో సర్వాంతర్యామి అనే పేరు తెచ్చుకొన్న ఆదిత్య చోప్రా పరిస్థితి అర్థం కాకుండా తయారైంది.
రాణి ముఖర్జీకి సమస్యలు
ఆదిత్య చోప్రా ప్రవర్తనతో రాణి ముఖర్జీకి అనేక సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదిత్య చోప్రాకు ఇతర సెలబ్రిటీల్లా ఫోటోలు తీసుకోవడం ఇష్టం ఉండదు అని రాణి చెప్పారు. ఇలా చాలాసార్లు మీడియాకు రాణి సమాధానం చెప్పుకోవాల్సిన సమస్య ఎదురైంది. తనకు శిష్యుడి లాంటి కరణ్ జోహర్కు కూడా అందుబాటులోకి లేకుండా ఉంటున్నాడు.
సెలబ్రిటీ పార్టీకి ఆదిత్య చోప్రా
తాజాగా వారాంతంలో ఆదిత్య చోప్రా ముంబైలోని ఓ పాపులర్ క్లబ్లో పార్టీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ఆయనను బంధించడానికి ప్రయత్నించగా, అతడు కెమెరాలకు ముఖం చాటేశాడు. చాలా రోజుల తర్వాత సెలబ్రిటీ పార్టీలకు హాజరుకావడం చర్చనీయాంశమైంది.
యష్ రాజ్ బ్యానర్పై వరుస చిత్రాలతో
ఆదిత్య చోప్రా మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ.. నిర్మాణ రంగంలో బిజీగా కనిపిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో చోటా భీమ్: కుంగ్ ఫు ధమాకా, హృతిక్ వర్సెస్ టైగర్, మర్దానీ2, సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.