Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కంగనను రేప్ చేయలేదు.. నాపై తప్పుడు కేసు.. బాలీవుడ్ నటుడి పరువు నష్టం
బాలీవుడ్ అందాల తార కంగన రనౌత్, నటుడు ఆదిత్య పంచోలి మధ్య మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. తన చెల్లెలు చేసిన నిర్వాకానికి కంగనకు గట్టి దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తున్నది. తనపై నిరాధార లైంగిక ఆరోపణలు చేసిన కంగన, తన సోదరి రంగోలిపై ఆదిత్య పంచోలి పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య జరీనా వాహబ్తో కలిసి వెర్సోవా పోలీసు స్టేషన్, కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే..
నా సోదరిపై లైంగిక వేధింపులు
ఆదిత్య పంచోలిపై కంగన రనౌత్ సోదరి రంగోలి చండేల్ ఈ-మెయిల్ ద్వారా ఆదిత్య పంచోలిపై వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సోదరి కంగనను దశాబ్దం క్రితం లైంగికంగా వేధించాడు. కంగనపై వేధింపులకు పాల్పడ్డాడు అని ఆదిత్యపై ఆరోపణలు చేసింది. రంగోలి చండేల్ ఈ మెయిల్ పిటిషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తుం చేపట్టారు.
కంగన రనౌత్ కేసుపై ఆదిత్య పంచోలి
కంగన, తన సోదరి చేసిన ఆరోపణలపై తాజాగా ఆదిత్య పంచోలి తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు రేప్ కేసును నమోదు చేశారు. వారు చేసిన ఆరోపణలను రుజువు చేయాలి లేకపోతే పరువు నష్టం దావా వేస్తాను అని ఆదిత్య పంచోలి మీడియాకు వెల్లడించారు. కంగన ఆరోపణలను నేను తీవ్రంగా పరిగణిస్తాను అని చెప్పారు.
కంగన రనౌత్ లాయర్ బెదిరింపులు
కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ కూడా తనను బెదిరిస్తున్నాడని వెల్లడించారు. గత కొద్దికాలంగా నాకు ఫోన్ చేసి చర్చలకు రమ్మంటున్నాడు. చాలా రోజులు లాయర్ అడిగిన తర్వాత ఓ రోజు నన్ను కలిశాడు. నీవు కోర్టులో తేల్చుకోవాలంటే.. మేము కోర్టుకు వస్తాం. మీరు రేప్ చేసినట్టు రుజువు చేస్తాం అని లాయర్ బెదిరించాడు అని ఆదిత్య వెల్లడించారు.
కేసు ఉపసంహరించుకోమని
తనపై తప్పుడు కేసు పెట్టిన విషయంపై తీవ్రంగా స్పందించారు. కంగన, రంగోలి ఫిర్యాదు మేరకు నేను వెర్సోవా పోలీస్ స్టేషన్, ఆంధేరి కోర్టుకు వెళ్లాను. ఆ తర్వాత వారికి నోటీసులు పంపితే వారు కోర్టుకు హాజరుకాలేదు. అంతేకాకుండా నేను పెట్టిన నాలుగు కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు అని వెర్సోవా పోలీసులకు అదిత్య పంచోలి లేఖ రాశారు.