Don't Miss!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కంగనను రేప్ చేయలేదు.. నాపై తప్పుడు కేసు.. బాలీవుడ్ నటుడి పరువు నష్టం
బాలీవుడ్ అందాల తార కంగన రనౌత్, నటుడు ఆదిత్య పంచోలి మధ్య మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. తన చెల్లెలు చేసిన నిర్వాకానికి కంగనకు గట్టి దెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తున్నది. తనపై నిరాధార లైంగిక ఆరోపణలు చేసిన కంగన, తన సోదరి రంగోలిపై ఆదిత్య పంచోలి పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య జరీనా వాహబ్తో కలిసి వెర్సోవా పోలీసు స్టేషన్, కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే..
నా సోదరిపై లైంగిక వేధింపులు
ఆదిత్య పంచోలిపై కంగన రనౌత్ సోదరి రంగోలి చండేల్ ఈ-మెయిల్ ద్వారా ఆదిత్య పంచోలిపై వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన సోదరి కంగనను దశాబ్దం క్రితం లైంగికంగా వేధించాడు. కంగనపై వేధింపులకు పాల్పడ్డాడు అని ఆదిత్యపై ఆరోపణలు చేసింది. రంగోలి చండేల్ ఈ మెయిల్ పిటిషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తుం చేపట్టారు.
కంగన రనౌత్ కేసుపై ఆదిత్య పంచోలి
కంగన, తన సోదరి చేసిన ఆరోపణలపై తాజాగా ఆదిత్య పంచోలి తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు రేప్ కేసును నమోదు చేశారు. వారు చేసిన ఆరోపణలను రుజువు చేయాలి లేకపోతే పరువు నష్టం దావా వేస్తాను అని ఆదిత్య పంచోలి మీడియాకు వెల్లడించారు. కంగన ఆరోపణలను నేను తీవ్రంగా పరిగణిస్తాను అని చెప్పారు.
కంగన రనౌత్ లాయర్ బెదిరింపులు
కంగన తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ కూడా తనను బెదిరిస్తున్నాడని వెల్లడించారు. గత కొద్దికాలంగా నాకు ఫోన్ చేసి చర్చలకు రమ్మంటున్నాడు. చాలా రోజులు లాయర్ అడిగిన తర్వాత ఓ రోజు నన్ను కలిశాడు. నీవు కోర్టులో తేల్చుకోవాలంటే.. మేము కోర్టుకు వస్తాం. మీరు రేప్ చేసినట్టు రుజువు చేస్తాం అని లాయర్ బెదిరించాడు అని ఆదిత్య వెల్లడించారు.
కేసు ఉపసంహరించుకోమని
తనపై తప్పుడు కేసు పెట్టిన విషయంపై తీవ్రంగా స్పందించారు. కంగన, రంగోలి ఫిర్యాదు మేరకు నేను వెర్సోవా పోలీస్ స్టేషన్, ఆంధేరి కోర్టుకు వెళ్లాను. ఆ తర్వాత వారికి నోటీసులు పంపితే వారు కోర్టుకు హాజరుకాలేదు. అంతేకాకుండా నేను పెట్టిన నాలుగు కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు అని వెర్సోవా పోలీసులకు అదిత్య పంచోలి లేఖ రాశారు.