Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సుశాంత్ మరణంపై అనుమానాలొద్దు.. హత్య కాదు.. ఆత్మహత్యే‘
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై గత కొద్ది నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల బృందం తెరదించింది. సుశాంత్ది హత్య కాదు.. ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యుల బృందం తరఫున డాక్టర్ సుధీర్ గుప్తా నివేదికను సమర్పించారు.
అయితే సుశాంత్ది 200 శాతం హత్యే అని గతంలో ఎయిమ్స్ వైద్యులు తనకు చెప్పారని వికాస్ సింగ్ ట్వీట్ చేయడం వివాదమైంది. ఆ వివాదం కొనసాగుతుండగానే డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా సుశాంత్ది ఆత్మహత్యే అని తేల్చడంతో ఆ వివాదం మరింత జటిలమైంది.
సుశాంత్ మరణంపై ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దాంతో సుధీర్ గుప్తా వివరణ ఇస్తూ.. సుశాంత్ మరణం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినప్పుడు చాలా అనుమానాలు ఉండేవి. ఆ క్రమంలోనే పోస్టు మార్టమ్ రిపోర్టులను, విసేరా రిపోర్టులను పరిశోధించాం. ఈ కేసులో తెలెత్తిన అనుమానాలకు సమాధానాలు వెతికాం. అందులో భాగంగానే మా అభిప్రాయాన్ని వెల్లడించాం అని సుధీర్ గుప్తా తెలిపారు.
ఇప్పుడు సుశాంత్ మరణం విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఏడుగురితో కూడిన వైద్యుల బృందం తమ అభిప్రాయాలను, నివేదికలను స్పష్టం చేసింది. సుశాంత్ది ఆత్మహత్యే అని ధృవీకరించింది అని సుదీర్ గుప్తా తెలిపారు. అయితే సుధీర్ గుప్తా తన నివేదిక విషయంలో మాట మార్చడంపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాయర్ వికాస్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను యూటర్న్ తీసుకోవడం వెనుక అసలు కారణమేమిటో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.