Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
‘సుశాంత్ మరణంపై అనుమానాలొద్దు.. హత్య కాదు.. ఆత్మహత్యే‘
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై గత కొద్ది నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల బృందం తెరదించింది. సుశాంత్ది హత్య కాదు.. ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యుల బృందం తరఫున డాక్టర్ సుధీర్ గుప్తా నివేదికను సమర్పించారు.
అయితే సుశాంత్ది 200 శాతం హత్యే అని గతంలో ఎయిమ్స్ వైద్యులు తనకు చెప్పారని వికాస్ సింగ్ ట్వీట్ చేయడం వివాదమైంది. ఆ వివాదం కొనసాగుతుండగానే డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా సుశాంత్ది ఆత్మహత్యే అని తేల్చడంతో ఆ వివాదం మరింత జటిలమైంది.
సుశాంత్ మరణంపై ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దాంతో సుధీర్ గుప్తా వివరణ ఇస్తూ.. సుశాంత్ మరణం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినప్పుడు చాలా అనుమానాలు ఉండేవి. ఆ క్రమంలోనే పోస్టు మార్టమ్ రిపోర్టులను, విసేరా రిపోర్టులను పరిశోధించాం. ఈ కేసులో తెలెత్తిన అనుమానాలకు సమాధానాలు వెతికాం. అందులో భాగంగానే మా అభిప్రాయాన్ని వెల్లడించాం అని సుధీర్ గుప్తా తెలిపారు.
ఇప్పుడు సుశాంత్ మరణం విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఏడుగురితో కూడిన వైద్యుల బృందం తమ అభిప్రాయాలను, నివేదికలను స్పష్టం చేసింది. సుశాంత్ది ఆత్మహత్యే అని ధృవీకరించింది అని సుదీర్ గుప్తా తెలిపారు. అయితే సుధీర్ గుప్తా తన నివేదిక విషయంలో మాట మార్చడంపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాయర్ వికాస్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను యూటర్న్ తీసుకోవడం వెనుక అసలు కారణమేమిటో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.