Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఎన్నటికి మర్చిపోలేను.. కరోనా నుంచి కోలుకున్న తరువాత మొదటి సారి స్పందించిన ఐశ్వర్యరాయ్
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. కేవలం సాధారణ జనాలే కాకుండా స్టార్ సెలబ్రెటీస్ కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ముందుగా ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కోలుకున్నారు. అయితే కోలుకున్న తరువాత మొదటిసారి ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
రూమర్స్ వైరల్ అవ్వకుండా
అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, అలాగే కోడలు ఐశ్వర్యారాయ్ మనవరాలు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. రూమర్స్ కి తావివ్వకుండా ఎప్పటికప్పుడు అమితాబ్ బచ్చన్ వారి ఆరోగ్యంపై వివరణ ఇస్తూనే ఉన్నారు. అభిషేక్ బచ్చన్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
నేను ఎప్పటికి మరచిపోలేను
ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో స్పందించని ఐశ్వర్యారాయ్ కోలుకున్న తరువాత మొదటిసారి వివరణ ఇచ్చారు. నా కోసం అలాగే నా కుటుంబ సభ్యులు కూడా త్వరగా కొలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమకు ఆదరాభిమానాలకు నేను ఎప్పటికి మరచిపోలేను అని ఐశ్వర్య పేర్కొంది.
దేవుడిని నిత్యం కోరుకుంటాను
అలాగే ఈ విషయంలో అందరికి నేను రుణపడి ఉంటాను అంటూ.. దేవుడు అందరిని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా మీరంతా బావుండలని ఆ దేవుడిని నిత్యం కోరుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ ఎప్పటికి తగ్గదు అనే విధంగా ఐశ్వర్యారాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో స్పెషల్ పోస్ట్ పెట్టింది.
వారు పూర్తిగా కోలుకున్న తరువాతే..
అలాగే ఐశ్వర్యారాయ్ తన కూతురితో చేతులతోనే లవ్ సింబల్ ని చూపిస్తూ.. నమస్కారం చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఇక ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కొలుకున్నప్పటికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇంకా ముంబైలోని నానావతి హాస్పిటల్ లోనే ఉన్నారు. వైద్యుల సమక్షంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు పూర్తిగా కోలుకున్న తరువాతే డిశ్చార్జ్ కానున్నారు.