Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వర్మ కన్నా ముందే కర్చీఫ్ వేసిన అజయ్... గాల్వన్ లోయపై ఘటనపై సినిమా
దేశంలో చోటుచేసుకున్నఅసాధారణ ఘటనలపై హుటాహుటిన సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పటివరకూ గాల్వన్ లోయ ఘటనపై ఎలాంటి చప్పుడూ చేయకపోయేసరికి, ఆ లోటు భర్తీ చేసేందుకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నడుంబిగించాడు. దేశాన్ని కుదిపేసిన గాల్వన్ లోయ ఘటనపై సినిమా నిర్మించేందుకు సమాయత్తం అయ్యాడు.
దేశ సరిహద్దులో భారత్ -చైనా నడుమ చోటుచేసుకున్న సంఘర్షణలో భారత్ కు చెందిన జవానులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తెరరూపం ఇచ్చేందుకు అజయ్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. సినిమా టైటిల్, ఇతర తారాగణం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి
ప్రస్తుతం అజయ్ దేవగణ్ మరో వార్ ఫ్మిల్మ్ భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై త్వరలోనే విడుదల కానుంది. అభిషేక్ దుడైయ్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1917లో భారత్ పాక్ నడుమ జరిగిన యుద్ధం ఆధారితంగా తెరకెక్కింది. సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, నోరా ఫతేహీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో భుజ్ విమానాశ్రయ అధికారి అయిన స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో అజయ్ కనిపించబోతున్నాడు.