Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వర్మ కన్నా ముందే కర్చీఫ్ వేసిన అజయ్... గాల్వన్ లోయపై ఘటనపై సినిమా
దేశంలో చోటుచేసుకున్నఅసాధారణ ఘటనలపై హుటాహుటిన సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పటివరకూ గాల్వన్ లోయ ఘటనపై ఎలాంటి చప్పుడూ చేయకపోయేసరికి, ఆ లోటు భర్తీ చేసేందుకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నడుంబిగించాడు. దేశాన్ని కుదిపేసిన గాల్వన్ లోయ ఘటనపై సినిమా నిర్మించేందుకు సమాయత్తం అయ్యాడు.
దేశ సరిహద్దులో భారత్ -చైనా నడుమ చోటుచేసుకున్న సంఘర్షణలో భారత్ కు చెందిన జవానులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తెరరూపం ఇచ్చేందుకు అజయ్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. సినిమా టైటిల్, ఇతర తారాగణం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి
ప్రస్తుతం అజయ్ దేవగణ్ మరో వార్ ఫ్మిల్మ్ భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై త్వరలోనే విడుదల కానుంది. అభిషేక్ దుడైయ్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1917లో భారత్ పాక్ నడుమ జరిగిన యుద్ధం ఆధారితంగా తెరకెక్కింది. సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, నోరా ఫతేహీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో భుజ్ విమానాశ్రయ అధికారి అయిన స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో అజయ్ కనిపించబోతున్నాడు.