twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ కన్నా ముందే కర్చీఫ్ వేసిన అజయ్... గాల్వన్ లోయపై ఘటనపై సినిమా

    |

    దేశంలో చోటుచేసుకున్నఅసాధారణ ఘటనలపై హుటాహుటిన సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పటివరకూ గాల్వన్ లోయ ఘటనపై ఎలాంటి చప్పుడూ చేయకపోయేసరికి, ఆ లోటు భర్తీ చేసేందుకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నడుంబిగించాడు. దేశాన్ని కుదిపేసిన గాల్వన్ లోయ ఘటనపై సినిమా నిర్మించేందుకు సమాయత్తం అయ్యాడు.

    దేశ సరిహద్దులో భారత్ -చైనా నడుమ చోటుచేసుకున్న సంఘర్షణలో భారత్ కు చెందిన జవానులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తెరరూపం ఇచ్చేందుకు అజయ్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. సినిమా టైటిల్, ఇతర తారాగణం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి

    Ajay Devgan to produce a Film on Galwan valley clash

    ప్రస్తుతం అజయ్ దేవగణ్ మరో వార్ ఫ్మిల్మ్ భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై త్వరలోనే విడుదల కానుంది. అభిషేక్ దుడైయ్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1917లో భారత్ పాక్ నడుమ జరిగిన యుద్ధం ఆధారితంగా తెరకెక్కింది. సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, నోరా ఫతేహీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో భుజ్ విమానాశ్రయ అధికారి అయిన స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో అజయ్ కనిపించబోతున్నాడు.

    English summary
    Ajay devagan to make a film on Galwan valley incident where, nearly 20 Indian Jawans lost thier lives during the clash. The film title, cast and crew has to be decided.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X