Don't Miss!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కాజోల్, ఆమె కూతురికి కరోనా?.. సోషల్ మీడియాలో వైరల్.. అజయ్ దేవగణ్ క్లారిటీ
బాలీవుడ్ క్యూట్ కపుల్ అజయ్ దేవగణ్-కాజోల్ గురించి, వారి ప్రేమ, వివాహ బంధం గురించి అందరికీ తెలిసిందే. తెరపైనే కాదు.. తెర వెనున, నిజ జీవితంలోనూ వీరద్దరు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సరదాలైనా, సరసాలైనా వీరి తరువాతే. సోషల్ మీడియాలోనూ వీరిద్దరు చెలరేగిపోతుంటారు. వీరిద్దరు ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్లు అందర్నీ ఆకట్టుకుంటాయి.
ఒకానొక సమయంలో అజయ్ చేసిన పని.. కాజోల్కు తలనొప్పిని తీసుకొచ్చింది. అనుకోకుండా భార్య నంబర్ను సోషల్ మీడియాలో షేర్ చేసేశాడు. ఆ వ్యవహారం అప్పట్లో తెగ వైరల్ అయింది. తాజాగా భార్య కాజోల్, కూతురు నైసాకు కరోనా సోకిందనే వార్తలు హల్చల్ చేస్తుండగా వాటిపై స్పందించాడు.
కరోనా వైరస్ బీభత్సం..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ధాటికి అతలాకుతలం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కరోనా బారిన పడగా వేల సంఖ్యలో మృతి చెందారు. మన దేశంలోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా కరోనా లక్షణాలు బయట పడ్డాయి.
21 రోజుల లాక్ డౌన్..
కరోనా వైరస్ను అడ్డుకునేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ను విధించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఎవ్వరూ రోడ్ల మీద తిరగొద్దని, అందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రధాని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తూ ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు.
|
అజయ్ దేవగణ్ ఫ్యామిలీ సైతం..
అజయ్ దేవగణ్ ఫ్యామిలీ సైతం సామాజిక దూరం పాటిస్తూ.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే అజయ్ కూతురు సింగపూర్లో చదువుతుండటం, ఇటీవలె ఇండియాకు తిరిగి రావడంతో వారికి కరోనా వచ్చి ఉంటుందనే రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి.
ఇద్దరూ క్షేమంగానే..
ఈ రూమర్లపై స్పందిస్తూ.. కాజోల్, నైసా గురించి అడిగిన వారందరికీ ధన్యవాదాలు.. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు.. వారి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిరాధరమైనవి, వాస్తవానికి దూరమని చెప్పుకొచ్చాడు. కరోనా లాంటి మహమ్మారి విస్తరిస్తున్న వేళ ఇలాంటి రూమర్సే ఎక్కువయ్యాయి.