Don't Miss!
- News కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అజయ్ దేవగన్కు రైతుల సెగ.. కారును అడ్డగించి..
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్కు రైతుల సెగ తగిలింది. ఆయన కారును రైతులు కొందరు అడ్డుకొన్నారు. ఈ ఘటన ముంబైకి సమీపంలో జరిగింది. అయితే కొద్ది రోజుల ముందు రైతుల ఉద్యమానికి సపోర్టుగా ఇంటర్నేషనల్ స్టార్ రిహన్నా చేసిన ట్వీట్ గందరగోళం సృష్టించింది.
ఆ క్రమంలో అజయ్ దేవగన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఇండియా గురించి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. అందర్నీ సమైక్యం ఉండాల్సిన సమయంలో ఇలా విభేదాలు సృష్టించే విధంగా ట్వీట్లు చేయవద్దు అంటూ అజయ్ దేవగన్ పరోక్షంగా రిహాన్నాను ఉద్దేశించి ట్వీట్ చేయడం తెలిసిందే.
మంగళవారం అజయ్ దేవగన్ కారును ముంబైకి సమీపంలోని గోరేగావ్ వద్ద కొందరు అడ్డుకొన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ నిలదీశారు. అజయ్ దేవగన్ను అడ్డుకొన్న వ్యక్తిని రాజ్దీప్ సింగ్గా గుర్తించారు. దాదాప 15 నిమిషాల పాటు కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నట్టు ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ వీడియోలో రాజ్దీప్ తన చేతి వేలిని అజయ్ దేవగణ్పై ముఖంపై పెట్టి మాట్లాడటం కనిపించింది. ఈ ఘటన అనంతరం రాజ్దీప్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
అయితే ఈ సంఘటనపై అజయ్ దేవగన్ ఏ విధంగా కూడా స్పందించకపోవడం గమనార్హం.
ఇక అజయ్ దేవగన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం RRR చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు బాలీవుడ్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.