Bell Bottom trailer : ఇంట్రెస్టింగ్ గా అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’..కానీ మొత్తానికి టెన్షన్ అదే!
అక్షయ్ కుమార్ తాజా మూవీ "బెల్ బాటమ్" ట్రైలర్ మంగళవారం నాడు విడుదలైంది. ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల అవుతోంది. ఇక బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ మోస్ట్ అవేటెడ్ చిత్రం ట్రైలర్ ఎలా ఉంది, అనేది పరిశీలిస్తే

విమానం హైజాక్
అక్షయ్ కుమార్తో సహా చిత్ర బృందం మొత్తం మంగళవారం అంటే ఆగస్టు 3న ఢిల్లీ నుండి బెల్ బాటమ్ ట్రైలర్ను విడుదల చేసింది. అక్షయ్ కుమార్తో పాటు, వాణి కపూర్, హుమా ఖురేషి మరియు లారా దత్తా కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. దాదాపు మూడున్నర నిమిషాల ట్రైలర్లో, భారతదేశానికి చెందిన విమానం హైజాక్ అయినట్లు చూపబడింది మరియు దీని తర్వాత బందీలుగా ఉన్న వ్యక్తులను రక్షించడానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించబడింది.

ఆగస్టు 19న థియేటర్లలోకి
ఈ బందీలను రక్షించడానికి ఎవరు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు, సరిగ్గా అప్పుడే అక్షయ్ కుమార్ ప్రవేశిస్తాడు. రా ఏజెంట్ గా ఆయన కోడ్ నేమ్ బెల్ బాటమ్. ఆయన ఈ మిషన్లో బయలుదేరాడు. ఈ సినిమా ట్రైలర్లో, అక్షయ్ కుమార్ మరోసారి తనదైన పాత స్టైల్ లోకి వెళ్ళిపోయాడు. ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను చూడవచ్చని అర్ధం అవుతోంది. అదే సమయంలో, ఈ సినిమాలో మంచి డైలాగులు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. రంజిత్ తివారీ దర్శకత్వం వహించిన బెల్ బాటమ్ ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా, ఈ సినిమా విడుదల తేదీ చాలా కాలంగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా 3D లో విడుదల కానుంది.

మహారాష్ట్ర ప్రభుత్వంతో టెన్షన్
అయితే కరోనాకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో అక్షయ్ కుమార్ అలాగే చిత్ర నిర్మాతలకు పెద్ద ఎదురుదెబ్బ పడిందని అంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలలో స్పష్టం చేసింది, వారు ఇంకా థియేటర్లను తెరిచే మూడ్లో లేరు. అయితే మహారాష్ట్రలో 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా ప్రారంభించడం గురించి ఇంతకు ముందు చర్చ జరిగింది. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దృష్ట్యా, థియేటర్లలో 'బెల్ బాటమ్' విడుదల చేయాలని నిర్ణయించారు, కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్, డైరెక్టర్ రంజిత్ తివారీ మరియు నిర్మాతలు పూజా ఫిలిమ్స్ ఈ సినిమాకు సంబంధించి కోట్ల సంపాదన కోల్పోయినట్లు తెలుస్తోంది. యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ నుంచి బాలీవుడ్ సినిమాలు 60 శాతం ఆదాయాన్ని పొందుతాయి , దేశవ్యాప్తంగా థియేటర్లు ఏప్రిల్ నెలలోనే లాక్ చేయబడ్డాయి.

ముందు అలా
అయితే, ఆగస్టు నుంచి, ఢిల్లీ ప్రభుత్వం సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ వంటి ప్రభుత్వాలు సినిమా హాళ్లను తెరవడానికి అనుమతి ఇచ్చాయి. యూపీ, బీహార్లలోని థియేటర్లు ఇప్పటికీ మూసివేయబడ్డాయి. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం 25 జిల్లాల్లో 50శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లను తెరవడానికి గతంలో అనుమతి ఇచ్చింది. ఈ ప్రకటనతో, అక్షయ్ కుమార్ తన చిత్రం 'బెల్ బాటమ్' విడుదల తేదీని ఆగస్టు 19 న ప్రకటించారు. కానీ కొత్త మార్గదర్శకాలు అక్షయ్ కుమార్ అండ్ టీం ప్రణాళికలను నాశనం చేశాయని చెప్పాలి.
Recommended Video
ఇప్పుడలా
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త కోవిడ్ లాక్ డౌన్లో, కొన్ని జిల్లాలకు సడలింపులు ఇచ్చారు. అదే సమయంలో, పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో సినిమా హాళ్లను మూసి ఉంచాలని నిర్ణయించుకున్నారు. సహజంగానే, ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమ మరియు థియేటర్ యజమానులకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఆగస్టు 2 నుండి థియేటర్లు తెరవబడతాయి అని ఇంతకు ముందు అందరూ భావించారు. అందుకే 'బెల్ బాటమ్' లాంటి పెద్ద బడ్జెట్ సినిమా కూడా విడుదలకు సిద్దం అయ్యింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేకర్లకు పెద్ద ఎదురుదెబ్బ. దీని వలన 'బెల్ బాటమ్' కలెక్షన్స్ లో కనీసం 20 శాతం నష్టపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఆగస్టు 19 తేదీకి ఇంకా 15 రోజులు మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మహారాష్ట్ర ప్రభుత్వం మరో సారి కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, కరోనా కేసులు తగ్గితే అప్పుడు థియేటర్లను తెరవడానికి అనుమతించే అవకాశం ఉంది. కానీ ఇది జరగకపోతే అది అక్షయ్ కుమార్కు, బెల్ బాటం మేకర్స్ కు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది.
నటీనటులు: అక్షయ్ కుమార్, వాణీ కపూర్, హ్యుమా ఖురేషి, లారా దత్తా, డేంజిల్ స్మిత్, అనిరుధ్ ధావే, ఆదిల్ హుస్సేన్ తదితరులు
దర్శకత్వం: రంజిత్ ఎం తివారీ
నిర్మాత: వశూ, జాకీ భగ్నానీ తదితరులు
రిలీజ్: 2021-08-19
బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటో గ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంబంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్బుక్, ట్విట్టర్ , ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











