twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం.. ప్రాణం ఉంటేనే ప్రపంచ మనుగడ అంటూ

    |

    కరోనావైరస్ ప్రభావంతో దేశం తల్లడిల్లిపోతున్న సమయంలో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ మానవత్వాన్ని చాటుకొంటూ ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు మానసిక ధైర్యాన్ని నింపేందుకు సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా అందిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ పిలుపుకు స్పందించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భూరి విరాళాలన్ని అందించారు. ఆయన దేశం కోసం ఎంత ప్రకటించారంటే..

    Recommended Video

    Akshay Kumar Donates Rs 25 Cr To PM Narendra Modi's Cares Fund
    ప్రధాని మోదీ పిలుపు

    ప్రధాని మోదీ పిలుపు

    దేశంలోని పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ అనే ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతాకు ఎవరైనా తమకు తోచిన విధంగా, తమ శక్తి మేరకు సహాయాన్ని అందించాలి. పౌరుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ ఖాతా నిధులను వినియోగిస్తాం అని ప్రధాని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ ఖాతాకు డెబిట్, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర మార్గాల ద్వారా విరాళాలను అందించవచ్చు అని పేర్కొన్నారు.

    స్పందించిన అక్షయ్ కుమార్

    స్పందించిన అక్షయ్ కుమార్

    ప్రధాని మోదీ పిలుపునకు స్పందించిన అక్షయ్ కుమార్ భారీ విరాళాన్ని అందించారు. మిగతా సినీ ప్రముఖులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలే ముఖ్యం. అందుకోసం ఎంతకైనా, దేనికైనా సిద్ధం కావాలి అని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

    25 కోట్ల విరాళం

    25 కోట్ల విరాళం

    ప్రధాని పిలుపునకు తాను సిద్ధమయ్యానని, నా వంతుగా ప్రధాని పేర్కొన్న పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందించాలని నిర్ణయించాను. నా సేవింగ్స్‌ నుంచి రూ.25 కోట్లు విరాళం ప్రకటిస్తున్నాను. ప్రజల ప్రాణాలను కాపాడుదాం. ప్రాణం ఉంటేనే ఈ ప్రపంచం మనుగడ ఉంటుంది అని ఎమోషనల్‌గా స్పందించారు.

    దేశ మనుగడ కోసం ప్రాణాల్ని కాపాడుదాం

    దేశ మనుగడ కోసం ప్రాణాల్ని కాపాడుదాం

    దేశం కోసం అక్షయ్ కుమార్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. పలు సందర్భాల్లో అక్షయ్ ప్రభుత్వాలకు అండగా నిలిచారు. తాజాగా రూ.25 కోట్ల విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు.

    English summary
    Akshay Kumar donates 25 crores to PM CARES Fund for Corona survive. He tweets that This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X