Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాపీ కొట్టారు, వెంటనే ఆపండి: వివాదంలో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే 'మిషన్ మంగళ్' సినిమా మొదలు కావడానికి ముందే వివాదంలో పడింది. ఈ సినిమా ప్రాజెక్టును వెంటనే ఆపి వేయాలంటూ యూఎస్ బేస్డ్ ఫిల్మ్ మేకర్ బాంబే హైకోర్టులో కేసు వేశారు.
రాధా భరద్వాజ్ అనే దర్శకురాలు ఈ కేసు వేశారు. తన స్క్రిప్టును కాపీ కొట్టి 'మిషన్ మంగళ్' తెరకెక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఈ ప్రాజెక్టను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని తన పిటీషన్లో పేర్కొన్నారు.
మార్స్ ఆర్బిటార్ మిషన్
2014లో ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) నేపథ్యంలో సాగే రియల్ స్టోరీతో ‘మిషన్ మంగళ్' ప్లాన్ చేశారు. నెల రోజుల క్రితమే అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమా రాబోతోందని, ఇందులో సోనాక్షి సిన్హా, విద్యా బాలన్, తాప్సీ పన్ను, శర్మాన్ జోషి, క్రితి కర్బంద, నిత్యా మీనన్ నటిస్తున్నట్లు తెలిపారు.
షాకైన రాధా భరద్వాజ్
ఈ ప్రకటన చూసి షాకైన రాధా భరద్వాజ్ వెంటనే కోర్టును ఆశ్రయించారు. 2016లోనే నిర్మాత అతుల్ కాస్బేకర్కు ఈ కథ చెప్పానని, వారితో అగ్రిమెంట్ కూడా అయిందని, అయితే కొన్ని కారణాల వల్ల వారితో అగ్రిమెంట్ రద్దు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
కష్టాల్లో అక్షయ్ కుమార్.. పోలీసుల అదుపులో 2 గంటలు.. 2.O రిలీజ్కు ముందు..
స్పేస్ మామ్స్
యూఎస్ఏ కాపీ రైట్స్ ప్రకారం 2016లోనే ఆమె తన స్టోరీ రిజిస్టర్ చేయించారట. ‘స్పేస్ మామ్స్' పేరుతో ఆమె తన సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. మార్స్ మిషన్లో పని చేసిన ఉమెన్ ఇంజనీర్ల చూట్టూ ఈ మూవీ సాగుతుందట.
మిషన్ మంగళ్
‘మిషన్ మంగళ్' చిత్రానికి జగన్ శక్తి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే సినిమా మొదలు కావడానికి ముందే కోర్టు వివాదం నెలకొనడంతో అసలు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.