Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
షాకింగ్: పబ్లిక్ ఈవెంటులో హీరో అక్షయ్ కుమార్ ఒంటికి నిప్పు, ఏం జరిగిందంటే?
Recommended Video
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో అక్షయ్ కుమార్ స్టేజీపై తన ఒంటికి నిప్పంటించుకుని ర్యాంప్ వాక్ చేయడం అందరూ షాకయ్యేలా చేసింది. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇదంతా తన తాజా చిత్రం 'కేసరి' సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన ఒక స్టంట్.
సన్నివేశాల్లో సహజత్వం కోసం రిస్కీ స్టంట్లు చేసే హీరోగా పేరున్న అక్షయ్ కుమార్... సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన పబ్లిక్ ఈవెంటులో కూడా ఒంటికి నిప్పంటించుకుని రిస్క్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
|
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
‘కేసరి' సినిమా ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్ చేసిన ఈ రిస్కీ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేసరి' మూవీలో శత్రువులను తరిమికొట్టు క్రమంలో హీరో తనకు తాను నిప్పటించుకుంటాడు. ఆ సన్నివేశం సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటుందని వివరిస్తూ... అక్షయ్ కుమార్ ప్రమోషనల్ ఈవెంటులో ఈ ఫీట్ చేశారట.
విమర్శలు
అయితే పబ్లిక్ ఈవెంటులో అక్షయ్ కుమార్ ఇలాంటి ఫీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ఎవరైనా ఈ స్టంట్ సేఫ్టీ లేకుండా ప్రయత్నిస్తే దానికి బాధ్యులు ఎవరు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
‘కేసరి’ మూవీ
21 మంది సిక్కు సైనికులు.. 10 వేల మంది ఆప్ఘనిస్థాన్ ఆక్రమరణదారులపై సారాగర్హి వద్ద జరిపిన భీకరయుద్ధం నేపథ్యంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'కేసరి'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సిఖ్ రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన భార్య పాత్రలో పరిణీతి చోప్రా నటించారు.
ట్రైలర్
అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ‘కేసరి' ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్తో కలిసి అరుణ్ భాటియా, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, సునీర్ ఖేటర్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జతిందర్ షా సంగీతం అందిస్తున్నారు. మార్చిన 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.