సూర్యవంశీ అప్డేట్.. ఆ రోజే అక్షయ్ కుమార్ సందడి
బాలీవుడ్ భారీ మల్టీ స్టారర్ కాప్ యాక్షన్ మూవీ సూర్యవంశీ నుంచి అప్డేట్ వచ్చింది. అక్షయ్ కుమార్ చేసిన భారీ స్టంట్స్ ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ కాంబోలో రాబోతోన్న ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించారు. మొత్తానికి లాక్డౌన్ వల్ల సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. గతేడాది గ్రాండ్గా రావాల్సిన ఈ మూవీ వాయిదాలు పడుతూ వచ్చింది.
మొత్తానికి ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చేసింది. ఆ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక షూటింగ్ సెట్లో కత్రినా చేసిన సందడి ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ప్రేక్షకులకు సూర్యవంశీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

సూర్యవంశీ రిలీజ్ డేట్ను ప్రకటించడంతో సోషల్ మీడియాలో మొత్తం అక్షయ్ కుమార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పోలీస్ సినిమాలు, యాక్షన్ చిత్రాలు తెరకెక్కించడంలో ఎంతో ఫేమస్ అయిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి ఈ మూవీతో బాలీవుడ్లో పండుగ వాతావరణం మొదలయ్యే అవకాశాలున్నాయి. కోవిడ్ తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న భారీ బడ్జెట్ మూవీ ఇదే.


Click it and Unblock the Notifications











