Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆలియాభట్, సంజయ్ లీలా భన్సాలీకి షాక్.. ముంబై కోర్టు సమన్లు
బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆలియాభట్, సంజయ్ లీలా భన్సాలీకి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై రెడ్లైట్ ఏరియాలో క్వీన్గా వెలుగొందిన గంగుభాయ్ కతియావాడి చిత్రంపై దాఖలైన పిటిషన్పై ముంబై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆలియా, సంజయ్ను మే 21న గానీ అంతకంటే ముందుగానీ కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
తన తల్లి ప్రతిష్టను కించపరిచే విధంగా, ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను అగౌరవ పరిచే విధంగా గంగుభాయ్ కతియావాడి చిత్రం ఉందనే ఆరోపణలతో ఆమె కుమారుడు బాబురావు షా ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో షా పిటిషన్ను పరిగణనలోకి తీసుకొని సమన్లు జారీ చేసింది.
గంగుభాయ్ కతియావాడి చిత్రం ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్నది.
సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా, దర్శకుడిగా గంగుభాయ్ కతియావాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం జూలై 30 తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది.