ఆలియాభట్, సంజయ్ లీలా భన్సాలీకి షాక్.. ముంబై కోర్టు సమన్లు
బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆలియాభట్, సంజయ్ లీలా భన్సాలీకి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై రెడ్లైట్ ఏరియాలో క్వీన్గా వెలుగొందిన గంగుభాయ్ కతియావాడి చిత్రంపై దాఖలైన పిటిషన్పై ముంబై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆలియా, సంజయ్ను మే 21న గానీ అంతకంటే ముందుగానీ కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
తన తల్లి ప్రతిష్టను కించపరిచే విధంగా, ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను అగౌరవ పరిచే విధంగా గంగుభాయ్ కతియావాడి చిత్రం ఉందనే ఆరోపణలతో ఆమె కుమారుడు బాబురావు షా ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో షా పిటిషన్ను పరిగణనలోకి తీసుకొని సమన్లు జారీ చేసింది.

గంగుభాయ్ కతియావాడి చిత్రం ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్నది.
సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా, దర్శకుడిగా గంగుభాయ్ కతియావాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం జూలై 30 తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది.


Click it and Unblock the Notifications











