Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
31 కోట్లతో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన అమితాబ్.. సన్నిలియోన్ ఉండే భవనంలోనే
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఖాతాలో మరో ఖరీదైన బంగ్లా చేరింది. ముంబై, మహారాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విలాసవంతమైన భవనాలు బిగ్బీకి ఉన్నాయి. ముంబైలోని జుహులో జల్సాలో నివాసం ఉంటున్నారు. అలాగే ముంబైలో ప్రతీక్ష, జనక్ అనే భవనాలు కూడా ఆయన పేరుపై ఉన్నాయి. ఇటీవల మరో అద్బుతమైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఇంటి వైశాల్యం 5184 చదరపు మీటర్లు (60 వేల చదరపు అడుగులు) అని తెలిసింది.
బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. గత డిసెంబర్లోనే విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది. ఇందుకోసం అమితాబ్ 62 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించారు అని బిజినెస్ మ్యాగజైన్ వెల్లడించింది.
అమితాబ్ కొనుగోలు చేసిన ఫ్లాట్స్ డాక్యుమెంట్ల ప్రకారం.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించిన అపార్ట్మెంట్లో 27, 28 ఫ్లోర్లో ఉంది. ఈ ఫ్లాట్కు ఆరు కారు పార్కింగ్స్ ఉన్నాయి.
ఇంకా ఈ అపార్ట్మెంట్లో ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా రూ.25 కోట్లతో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేశారు. అలాగే మార్చి 28 తేదీన సన్నిలియోన్ కూడా 16 కోట్లతో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.