Don't Miss!
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2100 రైతుల అప్పు తీర్చిన అమితాబ్, నెక్ట్స్ పుల్వామా అమర జవాన్ల కోసం..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీహార్లోని దాదాపు 2100 మంది రైతుల రుణాలు తన సొంత డబ్బులతో తీర్చారు. ఈ విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.
'నా మాట నిలబెట్టుకున్నాను. బీహార్ రాష్ట్రానికి చెందిన 2100 మంది రైతుల అప్పులు తీర్చాను. కొందరికి ఈ డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మరి కొందరికి అభిషేక్, శ్వేతా మీదుగా చెక్కులు అందించడం జరిగింది' అని బిగ్ బి తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.
ఇంతటితో నా బాధ్యత తీరలేదని అమితాబ్ వ్యాఖ్యానించారు. మరొక ప్రామిస్ కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది.. పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు సహాయం చేయాలి. త్వరలోనే దీన్ని పూర్తి చేస్తానని వెల్లడించారు. అమితాబ్ ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన 1398 రైతులు, మహారాష్ట్రకు చెందిన 350 రైతుల అప్పులు తీర్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే... 76 ఏళ్ల వయసులోనూ ఆయన అలుపు లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన 'బద్లా' ఇటీవల విడుదలవ్వగా ప్రస్తుతం ఝండ్, సైరా నరసింహారెడ్డి, తేరా యార్ హూ మే, బ్రహ్మాస్ర చిత్రాల్లో నటిస్తున్నారు.