Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టండి? బిగ్ బీతో.. సెన్సేషన్ అవుతున్న పిక్
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే హీరోల్లో అమితాబ్ బచ్చన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నేటితరం హీరోహీరోయిన్లతో పోటీ పడుతూ టెక్నాలజీని ఫుల్లుగా వినియోగించుకుంటారు అమితాబ్. ఈ వేదికగా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పంచుకుంటూ ప్రేక్షకులతో టచ్లో ఉంటారు అమితాబ్. ముఖ్యంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అప్పటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అందరి ముందు పెడుతుంటారాయన. బాలీవుడ్లో సీనియర్ హీరో కావడంతో ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు ఈయన వద్ద ఉంటాయి. అందులోని ఓ పిక్ని తాజాగా షేర్ చేసిన అమితాబ్.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టండి? అని సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఆ ఫొటోలో ఉన్నది అందాల తార కరీనా కపూర్ కావడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆమె చిన్నతనంలో అమితాబ్ చేస్తున్న పుకార్ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఆ సమయంలో తీసిన ఫొటోను అమితాబ్ షేర్ చేస్తూ.. ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టండి? తను ఎవరో కాదు కరీనా కపూర్. పుకార్ సినిమా షూటింగ్ సమయంలో సెట్కు వచ్చింది. ఆమె కాలికి గాయమైతే.. మందులు రాసి, బ్యాండేజ్ వేశాం అంటూ బిగ్బీ సందేశమిచ్చారు. పుకార్ సినిమాలో అమితాబ్, జీనత్ అమన్ తోపాటు కరీనా తండ్రి రణ్ధీర్ కపూర్ కూడా నటించారు. తండ్రితోపాటు షూటింగ్ స్పాట్కి వెళ్లిన కరీనా అక్కడ గాయపడి ఆ రోజుల్లోనే అమితాబ్ ప్రేమను పొందిందన్నమాట. కాగా నెట్టింట వైరల్గా మారిన ఈ పిక్లో నేటి అందాల తార కరీనా చిన్ననాటి రూపం చూసిన నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, మౌని రాయ్, నాగార్జున తదితరులు నటిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కరీనా విషయానికొస్తే.. ఆమె గుడ్ న్యూస్, అంగ్రేజీ మీడియం సినిమాలతో రెడీగా ఉంది.