twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ ఫ్యామిలి ఆరోగ్యంపై వైద్యుల తాజా రిపోర్ట్.. ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్‌లో అంటే..

    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, జూనియర్ బచ్చన్ అభిషేక్, ఐశ్వర్యరాయ్ కరోనావైరస్ బారిన పడటంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అమితాబ్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా బచ్చన్ ద్వయంపై నానావతి వైద్యులు వెల్లడించిన హెల్త్ రిపోర్టు ఏమిటంటే..

    అమితాబ్, అభిషేక్ ఫ్యామిలీకి కరోనా అనగానే..

    అమితాబ్, అభిషేక్ ఫ్యామిలీకి కరోనా అనగానే..

    శనివారం సాయంత్రం తనకు కరోనావైరస్ సోకిందనే వార్తను స్వయంగా అమితాబ్ వెల్లడించడం, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌ కూడా కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ షాక్ గురైంది. దేశవ్యాప్తంగా పలు భాషలకు చెందిన నటులు, అభిమానులు కూడా బచ్చన్ ఫ్యామిలీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నానావతి హాస్పిటల్‌లో చికిత్స బాగుందని, వైద్యుల సేవలు బ్రహ్మండంగా ఉన్నాయి అంటూ అమితాబ్ వీడియో షేర్ చేయడంతో ఊరట కలిగింది.

     నిలకడగా బిగ్‌బీ ఆరోగ్యం

    నిలకడగా బిగ్‌బీ ఆరోగ్యం

    తాజాగా పీటీఐ వార్త సంస్థకు నానావతి హస్పిటల్ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం మేరకు.. అమితాబ్, అభిషేక్ చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. వారి ఆరోగ్యం కుదటపడింది. శ్వాసపరమైన ఇబ్బందులు తగ్గాయి. ఇంకా ఏడు రోజులపాటు హాస్పిటల్‌లో ఉండాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు వారి ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

    అమితాబ్, అభిషేక్ ఐసోలేషన్‌లోనే..

    అమితాబ్, అభిషేక్ ఐసోలేషన్‌లోనే..

    అమితాబ్, అభిషేక్ ఇద్దరు ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. తాజా వైద్య పరీక్షల రిపోర్టుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారికి భారీస్థాయిలో ట్రీట్‌మెంట్ అంటే వెంటిలేటర్ లాంటి చికిత్సలు అవసరం లేదు. ప్రాథమికంగా అందించే సాధారణ వైద్యం సరిపోతున్నది. సరైన విధంగా ఆహారం తీసుకొంటున్నారు. అన్ని రకాలుగా వారిద్దరు బాగానే రెస్పాండ్ అవుతున్నారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

    ఇంటి వద్దే ఐష్, ఆరాధ్య బచ్చన్

    ఇంటి వద్దే ఐష్, ఆరాధ్య బచ్చన్

    ఇదిలా ఉండగా, బచ్చన్ ఫ్యామిలీ వద్ద పనిచేసే సిబ్బందిలో 26 మందికి కరోనావైరస్ నెగిటివ్ వచ్చింది అని ముంబై మున్సిపల్ అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్, అరాధ్య బచ్చన్ ఇద్దరు తమ నివాసంలోనే క్వారంటైన్‌లోనే ఉన్నారు. నానావతి హాస్పిటల్ నుంచే తన కుటుంబ గురించి అభిషేక్ తగిన చర్యలు, సంరక్షణ తీసుకొంటున్నట్టు తెలిపారు.

    ఆ నలుగురితోనే సోకిన కరోనావైరస్

    ఆ నలుగురితోనే సోకిన కరోనావైరస్

    మహారాష్ట్రంలో కరోనావైరస్‌ విలయతాండవం చేస్తున్న సమయంలో వలస కార్మికులకు అమితాబ్ బచ్చన్ తన వంతు సహాయం అందించి వారిని సొంత ఊళ్లకు పంపించే ప్రయత్నం చేశారు. ఇంటిపట్టునే ఉంటూ సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే కేబీసీ ప్రోమో షూట్‌కు వచ్చిన స నలుగురు సిబ్బందితో కారణంగానే అమితాబ్ కుటుంబం కరోనావైరస్ బారిన పడినట్టు

    English summary
    Amitabh and Abhishek Bachchan tested CoronaVirus Positive on Saturday. Then both were joined in Nanavati Hospital on the same day. As per Nanavati Hospital health Report, Both actors are doing well in Isolations. Hospital sources said that At present, they do not require aggressive treatment. They are okay with the first line of medication.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X