Don't Miss!
- News ఊపిిరి పీల్చుకున్న ఉద్యాననగరి
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
శ్రీదేవి కనిపిస్తే కాళ్లు మొక్కేవాడిని.. సీనియర్ నటుడు ఎమోషనల్
అలనాటి అందాల నటి శ్రీదేవి ఆకస్మిక మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం ఫ్యామిలీ, స్నేహితులనే కాకుండా కోట్లాది మంది అభిమానులను విషాదంలో ముంచెత్తింది. గత ఫిబ్రవరిలో దుబాయ్లో బాత్ టబ్లో మునిగి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీదేవితో అనుబంధాన్ని తన మరిది అనిల్ కపూర్ వెల్లడించారు.
శ్రీదేవితో నా అనుబంధం
శ్రీదేవి, అనిల్ కపూర్ది బంధం చాలా ప్రత్యేకమైనది. కుటుంబ బంధానికి కంటే ముందు హీరో హీరోయిన్లుగా వారిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత తన సోదరుడు బోనికపూర్ వివాహం చేసుకోవడంతో వదినగా మారింది.
భావోద్వేగానికి గురైన అనిల్
తన వదిన శ్రీదేవి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. శ్రీదేవి అంటే నాకు చాలా గౌరవం. ఆమె కనిపించిన ప్రతీసారి కాళ్లకు దండం పెట్టుకొనే వాడిని అని అనిల్ కపూర్ వెల్లడించారు.
శ్రీదేవి కాళ్లను తాకితే
అయితే తనంటే శ్రీదేవికి చాలా గౌరవం ఉండేది. నేను ఆమె కాళ్లను తాకేటప్పుడు వారించేంది. అలా చేయకూడదని చెప్పేది. మరిదిగా శ్రీదేవి కాళ్లకు మొక్కితే ఆమె చాలా ఇబ్బందిగా ఫీలయ్యేది. కానీ నేను ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోయే వాడిని అని అనిల్ కపూర్ గుర్తు చేసుకొన్నారు.
అది గొప్ప వరంగా
శ్రీదేవీతో సహనటుడిగా తన అనుభవాన్ని అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు. ఒక నటుడిగా శ్రీదేవితో కలిసి నటించడం గొప్ప వరంగా భావిస్తాను. నా కెరీర్ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఆమె కృషి చాలా ఉంది. ఆమె లేకపోతే నా కెరీర్ ఏమైపోయి ఉండేదేమో అని అనిల్ కపూర్ పేర్కొన్నారు.
కెమెరా ముందు శ్రీదేవి మ్యాజిక్
అద్భుతమైన టాలెంట్ ఉన్న నటి శ్రీదేవి. కెమెరా ముందుకు వచ్చిందంటే మ్యాజిక్గా అనిపించేది. తెరపైన చూస్తే ఏదో అద్భుతాన్ని చూసినట్టు ఉండేది. విషాదం మాటున ఆమెను గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఆమె ప్రేమ, ఆనందం, నటనను తలచుకొని జీవించాల్సిందే అని అనిల్ ఎమోషనల్ అయ్యారు.
ఇంకా విషాదంలో ఉన్నామని
దుబాయ్లోని ఓ హోటల్ సూట్లోని బాత్ టబ్లో మునిగి శ్రీదేవి ప్రమాదవశాత్తూ ఫిబ్రవరి 24న మరణించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మరణంతో భర్త బోనికపూర్, కూతుళ్లు జాహ్నవి విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికి తనను మరిచిపోలేమని పదే పదే బోనికపూర్ చెప్పడం గమనార్హం.