హీరోకు కటీఫ్.. వ్యాపార వేత్తతో డేటింగ్, లిప్లాక్స్.. 8 పడకల గదిలో..
బాలీవుడ్లో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ.. అంకిత లోఖండ్ మాత్రం మీడియాలో ఎప్పడూ హెడ్లైన్లలో ఉంటారు. హిందీ టెలివిజన్ రంగంలో ఐదేళ్లపాటు కొనసాగిన పవిత్ర రిస్తా అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. తాజాగా మణికర్ణిక చిత్రంతో మరోసారి ఆడియెన్స్కు చేరువైంది. అయితే అంకితకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నది. త్వరలోనే ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు మీడియా కోడైకూస్తున్నది. వివరాల్లోకి వెళితే..

సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కటీఫ్
అంకిత లోఖండే తన కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో అఫైర్ నడిపించింది. చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరూ వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారు. అనంతం వికీ జైన్ అనే వ్యాపారవేత్తతో అతిసన్నిహితంగా ఉంటూ మీడియాలో హాట్ టాపిక్కు కారణమయ్యారు.

పార్గీలో రచ్చ రచ్చ
ఇటీవల వికీ, అంకిత ముంబైలోని ఓ పార్టీలో కనిపించి మీడియాను హాటెక్కించారు. విందులో ముద్దులు పెట్టుకొంటున్న ఫొటోలు మీడియాలో పతకాశీర్షికలను ఆకర్షించాయి. ఆ ముద్దుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత మేము ప్రేమలో ఉన్నట్టు అంకిత వెల్లడించింది.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
అంకిత, వికీ జైన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్త వైరల్ అవుతున్నది. వైవాహిక జీవితాన్ని గడపడానికి ముంబై నగర శివారులో 8 పడకల ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. తమ అభిరుచికి తగినట్టుగా ఇంటిని డిజైన్ కూడా చేస్తున్నట్టు సమాచారం.

డిసెంబర్, లేదా జనవరిలో వివాహం
అంకిత, వికీ జైన్ ఇద్దరూ వివాహం తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడుపాలని నిర్ణయించుకొన్నారు. అందుకు తగిన ప్లాన్స్ చేసుకొంటున్నారు. ఆ క్రమంలోనే ఇంటికి హంగులు అద్దుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో గానీ, వచ్చే ఆరంభంలో గానీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు అని బాలీవుడ్ మీడియా పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











