Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లైంగికంగా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయవా? నీ తీరుపై అనుమానం!
Recommended Video
బాలీవుడ్ ముద్దుగుమ్మ తనుశ్రీ దత్తా, నానా పాటేకర్ లైంగిక వేధింపుల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. పదేళ్ల క్రితం హర్న్ ఓకే ప్లీజ్ షూట్ సమయంలో నానా పాటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ చేసిన ఆరోపణలపై బాలీవుడ్ ప్రముఖులు తలో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నటుడు, గాయకుడు, టెలివిజన్ హోస్ట్ అను కపూర్ తన స్పందనను వ్యక్తం చేశారు. తను శ్రీ దత్తా చేస్తున్న ఆరోపణలపై పలు సందేహాలను వ్యక్తం చేశారు. అను కపూర్ ఏమన్నారంటే..
దోషికి శిక్ష పడాల్సిందే
తను శ్రీ దత్తాని నానా పాటేకర్ లైంగికంగా వేధిస్తే మహిళల మనోభావాలు దెబ్బతిన్నట్టే భావించాలి. ఒకవేళ అందే నిజమైతే ఎవరైనా శిక్షను తప్పించుకోలేరు. అది నానా పాటేకర్ అయినా, అను కపూర్ అయినా శిక్ష అనుభవించాల్సిందే. రుజువులుంటే దోషికి శిక్ష పడుతుంది అని అను కపూర్ అన్నారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తే వాటిపై అనేక సందేహాలు వస్తాయి. ఆరోపణలపై ఎగిసిపడే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. నీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టలేదు. మీడియా విచారణను ఎందుకు కోరుకొంటున్నావు అని అను ప్రశ్నించారు.
మీడియా సహకారం ఎందుకు
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, చట్టాల సహకారం తీసుకోకుండా మీడియా సహాయాన్ని ఎందుకు కోరుకుంటున్నావు. ఇలా మీరు వ్యవహరించడం వల్ల మీ ఆరోపణలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తనుశ్రీ దత్తాకి లీగల్ నోటీసులు
తమపై తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై నానా, వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఈ వివాదంలో తనుకు వారిద్దరూ లీగల్ నోటీసులు పంపించారు. తమ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.
పుణేలో ఎంఎన్ఎస్ కేసు నమోదు
ఇటీవల ఈ వివాదంలో ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రేపై తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. పుణేలో తను శ్రీపై కేసు నమోదు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేసి రాజ్ థాక్రేను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు.