Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సెక్స్ వర్కర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి.. మరో వివాదంలో సంజు!
వివాదాస్పద నటుడు సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు శుక్రవారం జూన్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అయింది. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. ట్రైలర్, టీజర్ సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేసాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సంజయ్ దత్ జీవితం మొత్తం వివాదభరితం కావడంతో సంజు చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. తాజగా ఈ చిత్రం విషయంలో వివాదం చెలరేగింది. సెక్స్ వర్కర్స్ మనోభావాలని కించపరిచే విధంగా ఈ చిత్రంలో డైలాగ్స్ పెట్టారని ఆరోపిస్తూ నేషనల్ విమెన్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు.
సెక్స్ వర్కర్స్ తరుపున న్యాయవాది గౌరవ్ ఈ ఫిర్యాదు చేశారు. ట్రైలర్ లో సెక్స్ వర్కర్స్ కి సంబందించిన డైలాగ్ ఉంది. నీవు ఎంతమందితో పడుకున్నావు.. వేశ్యలు కాకుండా అయితే 308 అని రణబీర్ కపూర్ సమాధానం ఇస్తాడు. విమెన్ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ దీనిపై స్పందించారు. ఈ ఫిర్యాదుని ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి పంపాము. వారు ఇచ్చే నివేదికని బట్టి చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.
ముంబై పేలుళ్లలో ప్రమేయం, డ్రగ్స్, అక్రమ ఆయుధ రవాణా వంటి వివాదాలతో సంజయ్ దత్ జీవితం ఒడిదుడుకులకు గురైంది. ఈ అంశాలని రాజ్ కుమార్ హిరానీ ఎలా చూపించారు అనే అంశం ఆసక్తిగా మారింది.