Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అనుపమ్ ఖేర్ భార్యకు క్యాన్సర్.. మాధురి దీక్షిత్ ఎమోషనల్
నటి, రాజకీయ నాయుకురాలైన కిరణ్ ఖేర్ (అనుపమ్ ఖేర్ భార్య) క్యాన్సర్తొ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. క్యాన్సర్తో పోరాడి బయటపడిన సెలెబ్రిటీలెందరో ఉన్నారు. అయితే కిరణ్ ఖేర్ బ్లెడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలందరూ ట్వీట్లు పెడుతున్నారు.
మాధురి దీక్షిత్ ఎమోషనల్ అవుతూ.. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఆమెకు నా ప్రేమను తెలపండి సర్ అని కోరింది. అలాగే పరిణితి చోప్రా, రణ్ వీర్ షోరేస్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సెలెబ్రిటీల ట్వీట్లపై అనుపమ్ ఖేర్ స్పందించాడు. తన భార్యపై చూపిస్తోన్న ప్రేమకు ఎమోషనల్ అయ్యాడు.
ఆమె ఎంతో మంచిది.. అందుకే ఇంత మంది ఆమెను ప్రేమిస్తున్నారు.. మీకు ఎలా వీలైతే అలా.. మీ ప్రేమను పంపుతూ, పంచుతూ ఉండండి.. మీ హృదయంలోనే ఆమె కోసం కోరుకోండి.. మీ ప్రేమ, మద్దతు ఉంటే ఆమె త్వరగా కోలుకుని వస్తుంది.. ఆమె ప్రస్తుతం రికవరీ అవుతోంది అంటూ అనుపమ్ ఖేర్ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు.