Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సుశాంత్ ఒక టీవీ ఆర్టిస్ట్ అని.. ఆ హీరోయిన్ నటించనని చెప్పేసింది: అనురాగ్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఆరు నెలలుగా ఎదో ఒక వివాదం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు మొదలుకొని నిత్యం బాలీవుడ్ ప్రముఖులు అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. డ్రగ్స్ వివాదం తరువాత కంగనా, శివ సేన పొలిటికల్ వార్ ఒక రేంజ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేయగా.. రీసెంట్ గా పాయల్ ఘోష్ , అనురాగ్ కశ్యప్ ల వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది.
అనురాగ్ కశ్యప్ కౌంటర్స్..
అనురాగ్ కశ్యప్, పాయల్ ఆరోపణలను కండిస్తూ తనదైన శైలిలో మద్దతు అయితే అందుకుంటున్నాడు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రతి విమర్శకు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల కంగనా కూడా ఈ దర్శకుడిపై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో వెంటనే కౌంటర్ ఇచ్చాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో పరిణీతి చోప్రా, సుశాంత్ ని అవమానించిన సంఘటన గురించి కూడా అనురాగ్ స్పందించాడు.
సుశాంత్ ఉన్నాడని చేయనని చెప్పింది
సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా తెరకెక్కిన ‘హసీ తో ఫసీ' సినిమా మొదట సుశాంత్ చేయాల్సింది. పరిణీతి చోప్రా కారణంగా సుశాంత్ ని తప్పించాల్సి వచ్చిందని తెలిపారు. అనురాగ్ మాట్లాడుతూ.. ఆ సినిమాకు పరిణీతి చోప్రాను ఫిక్స్ చేసుకున్న తరువాత హీరోగా సుశాంత్ ని అనుకున్నాం. కానీ పరిణీతి అందుకు ఒప్పుకోలేదు. ఒక టీవీ యాక్టర్ తో నేను నటించలేను అని డైరెక్ట్ గా చెప్పేసింది.
అతను ఒక టీవీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు
కానీ మేము ఆమెకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలని అనుకున్నాం. అతను ఒక టీవీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. అప్పుడు అమీర్ ఖాన్ పీకే సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నాడని అలాగే హీరోగా ఒక సినిమా చేస్తున్నాడని మంచి టాలెంటేడ్ యాక్టర్ అని ఆమెకు చెప్పాము. ఇక పరిణీతి అతనితో మరో సినిమా చేయడానికి ఒప్పుకుంది.
హసీ తో ఫసీ' సినిమాకు బదులు మరో సినిమా
ఆ సమయంలో ‘శుద్ధ్ దేశీ రోమాన్స్' చిత్రానికి పరిణీతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మాతలు సుశాంత్ని పిలిచి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.‘‘హసీ తో ఫసీ' సినిమాకు బదులు ‘శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమా ద్వారా సుశాంత్ కి మరో అవకాశం ఇచ్చినట్లు.. అనురాగ్ తెలిపారు. ఇక ఆ సినిమాతోనే సుశాంత్ కెరీర్ కి నటుడిగా కూడా ఒక మంచి గుర్తింపు వచ్చిందని వివరణ ఇచ్చారు.