Don't Miss!
- News ఎన్నికల్లో కీలక ఘట్టం ..నేటి నుంచే నామినేషన్లు షూరూ
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మోదీజీ... నా కూతురును రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు: టాప్ డైరెక్టర్ ఆవేదన
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. 2019 ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు కంగ్రాట్స్ చెబుతూనే.. సంచలన ట్వీట్ చేశారు ఈ అగ్ర దర్శకుడు.
మోదీ అభిమానులుగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కొందరు వ్యక్తులు తన కూతురును రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. అలాంటి వారిని ఎలా డీల్ చేయాలి, వారి బారి నుంచి నా కూతురును ఎలా కాపాడుకోవాలో చెప్పి హెల్ప్ చేయండని అనురాగ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
|
సంచలనం రేపుతున్న ట్వీట్
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ పేరు ‘చౌకీదార్ రామ్సంఘి' అని ఉంది. అతడు చేసిన ట్వీట్ చూసి కంగారుపడిపోయిన దర్శకుడు వెంటనే ప్రధాని మోదీ సహాయం కోరుతూ సోషల్ మీడియాను ఆశ్రయించడంతో వైరల్ అవుతోంది.
మీ నాన్నకు చెప్పు మరోసారి మోదీనికి వ్యతిరేకంగా మాట్లాడితే...
అనురాగ్ కశ్యప్ కూతురు అలియాను బెదిరిస్తూ ‘చౌకీదార్ రామ్సంఘి' అనే వ్యక్తి అసభ్యమైన వ్యాఖ్యలు చేశారు. ‘మీ నాన్నకు చెప్పు మరోసారి మోదీనికి వ్యతిరేకంగా మాట్లాడితే నిన్న రేప్ చేస్తాం' అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ బెదిరింపులతో బెంబేలెత్తిపోయి అనురాగ్ కశ్యప్ ఈ విషయం అందరికీ తెలిసేలా ట్వీట్ చేశారు.
అది ఫేక్ అకౌంటే అంటున్న అశోక్ పండిట్
అనురాగ్ కశ్యప్ చేసిన ట్వీటుపై ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ స్పందించారు. మోదీ అనుచరులుగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అకౌంట్ ఫేక్ అకౌంట్ అని, అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మోదీని టార్గెట్ చేస్తూ కొందరు కావాలనే ఇలాంటి చేస్తుంటారని తెలిపారు.
పండిత్ ట్వీట్ మీద భగ్గుమన్న అనురాగ్
అయితే అశోక్ పండిట్ చేసిన ట్వీట్... అనురాగ్ కశ్యప్కు కోపం తెప్పించింది. ఇది నా కూతురు జీవితం ఇడియట్ అంటూ ఫైర్ అయ్యారు. దీనికి అశోక్ పండిట్ బదులిస్తూ... గతంలో నా కూతురు విషయంలో కూడా ఇలాగే జరిగిందని, పోలీస్ కంప్లయింట్ కూడా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు కూడా రాజకీయాల కంటే నా కూతురు డిగ్నిటీ, సేప్టీ ముఖ్యమని తెలిపారు.