Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
గత రెండు మూడు రోజుల నుంచి తాప్సీ, అను రాగ్ కశ్యప్ పేర్లు సోషల్ మీడియా, మీడియాలో మార్మోగిపోతోంది. ఫాంథమ్ ప్రొడక్షన్ కంపెనీలో జరిగిన అవకతవకలు, పన్ను ఎగవేతలపై సమాచారంతో ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. అనురాగ్ కశ్యప్, తాప్సీ, వికాస్ భల్, విక్రమాదిత్య వంటి ప్రముఖుల ఇంట్లో సోదాలు జరిపింది. అయితే మొత్తంగా రూ. 650 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని ఐటీ శాఖ తెలిపింది.
ఫాంథోమ్ బ్యానర్పై నిర్మించిన సినిమాలు, వాటి లెక్కల్లో తేడా చూపించడంతో ఆదాయాల్లో భారీగా మార్పులు వచ్చాయని, తాప్సీకి సంబంధించిన ఐదు కోట్ల వివరాలు కూడా తేడా కొడుతున్నాయని ఐటీ శాఖ తెలిపింది. అనురాగ్ కశ్యప్, తాప్సీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఇతర ఆదాయ మార్గాలపైనా ఐటీ శాఖ కన్నేసింది. అయితే ఇంత జరిగినా కూడా తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇద్దరూ కూడా రియాక్ట్ అవ్వలేదు.
సింపుల్గా ఈ విషయాన్ని అలా వదిలేసి తమ తమ సినిమా పనుల్లో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ దోబారా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మళ్లీ షూటింగ్ ప్రారంభించేశాను.. నన్ను ద్వేషించే వారికి కూడా ప్రేమతో ఈ విషయాన్ని చెబుతున్నాను అంటూ అనురాగ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మరో వైపు తాప్సీకి టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది.