Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బర్త్ డే రోజున అనుష్క శర్మ ఎమోషనల్.. ఆవేదనతో కవిత రాసిన బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకొన్నారు. తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకొన్నారు. లాక్ డౌన్ కొనసాగడం, బాలీవుడ్లో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి అగ్ర నటులు మరణం చెందడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు. ఆ కారణంగా జన్మదిన వేడుకలను హంగామా మధ్య జరుపుకోవడానికి నిరాకరించారు. అనుష్క శర్మ మే 1 తేదీన 32 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టారు.
ఇన్స్టాగ్రామ్లో తన భర్తతో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేశారు. నీవు నా ప్రపంచంలోకి ప్రేమ అనే కాంతిని తీసుకొచ్చావు. నీ జీవితంలో ప్రతీ రోజు వెలుగు నింపుతున్నావు. ఐ లవ్ యూ అంటూ ఆమె ఓ సందేశాన్ని పోస్టు చేశారు. అంతకు ముందు ఇర్ఫాన్, రిషిని స్మరించుకొంటూ వారి ఫోటోలను కూడా పోస్టు చేశారు.
ఈ సందర్భంగా..ప్రస్తుతం ఆమె చుట్టూ నెలకొన్న పరిస్థితులపై ఆమె కవితాధోరణిలో భావోద్వేగంగా స్పందించారు. ఈ మేరకు ఓ కవితను రాసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు.
నా చుట్టూ ఉన్న విషాదం దూరం కావాలి.. ఈ కష్టాలన్నీ ఇక శాశ్వతంగా తొలిగిపోవాలి అంటూ ఓ కవితను రాసి తనలోని భావాలను అభిమానులతో పంచుకొన్నారు. ఆ కవిత పూర్తిగా మీ కోసం..
View this post on InstagramToday, I wish for all this to end
A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ కంపెనీలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందించిన వెబ్ సిరీస్ పాతాళ లోకంకు సంబంధించిన టీజర్ను తన ఇన్స్టాగ్రామ్లో ఆవిష్కరించారు. ఈ సిరీస్లో గుల్ పనాగ్, జైదీప్ అహ్లావత్, అభిషేక్ బెనర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు నటించారు.