Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాకు నిర్మాతగా ఏఆర్ రెహ్మాన్
సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సరికొత్త పాత్రను పోషించబోతున్నారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ నటిస్తున్న నో ల్యాండ్స్ మ్యాన్ అనే చిత్రానికి సహ నిర్మాతగా మారారు. ఆ చిత్రానికి రెహ్మన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలో ఆయన ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకోవడం విశేషంగా మారింది.
ఏఆర్ రెహ్మన్ తన సినిమాకు నిర్మాతగా మారిన విషయాన్ని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. నేను నటిస్తున్న నో ల్యాండ్స్ మ్యాన్ సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ సహ నిర్మాతగా మారిన విషయాన్ని తెలియజేయడానికి నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఈ చిత్రాన్ని ముస్తాఫా సర్వర్ ఫరూఖీ రూపొందిస్తున్నారు అంటూ పేర్కొన్నారు.
ఇండియా, బంగ్లాదేశ్ అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ దర్శకుడు ముస్తాఫా సర్వర్ ఫరూఖీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇర్ఫాన్ ఖాన్ నటించిన దూబ్: ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అనే సినిమాను రూపొందించారు. ఈ చిత్రం ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండియాతోపాటు న్యూయార్క్లో షూటింగు జరుపుకొన్నది.