Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
సుశాంత్ కేసులో అర్జున్ రాంపాల్కు షాక్.. ప్రియురాలి సోదరుడి అరెస్ట్
హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో 23వ అరెస్ట్ జరగడం చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్తో సహజీవనం చేస్తున్న గ్యాబ్రిల్లా డెమెట్రియాడెస్ సోదరుడు ఏజిసిలోస్ డేమిట్రియాడెస్ను ఈ కేసులో అనుమానితుడిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కస్టడీలోకి తీసుకోవడంతో దిగ్బ్రాంతిని కలిగించింది. ఈ అరెస్ట్ వివరాల్లోకి వెళితే..
అర్జున్ రాంపాల్ ప్రేయసి సోదరుడి అరెస్ట్
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో నిషేధిత మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఏజిసిలోస్ డేమిట్రియాడెస్ను అదుపులోకి తీసుకొన్నామని ఎన్సీబీ అధికారులు ధృవీకరించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేసిన CIR 16/20 కేసులోనే అదుపులోకి తీసుకొన్నట్టు పేర్కొన్నారు.
నిషేధిత మాదక ద్రవ్యాల స్వాధీనం
డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్సీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఏజిసిలోస్ డేమిట్రియాడెస్ నుంచి అల్ప్రాజోలమ్ టాబ్లెట్స్, హాషిష్ లాంటి మాదక ద్రవ్యాలను సొంతం చేసుకొన్నట్టు తెలిపారు. డ్రగ్ రాకెట్ కేసుకు సంబంధమున్న పలువురు డ్రగ్స్ సరఫరాదారులతో బలమైన సంబంధాలు ఉన్నట్టు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు.
సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత
కొద్దికాలంగా అర్జున్ రాంపాల్, గ్యాబ్రిల్లా డెమెట్రియాడెస్ సహ జీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తన సోదరుడి అరెస్ట్తో గ్యాబ్రిల్లా, అర్జున్ రాంపాల్ షాక్ గురయ్యారు. ఈ క్రమంలో తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ప్రైవేట్ మోడ్లోకి మార్చుకొని పబ్లిక్ లైఫ్ను పరిమితం చేశారు.
23వ వ్యక్తిగా గ్యాబ్రిల్లా సోదరుడు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తికి దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్ లభించింది. షోవిక్ ఇంకా ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో ధర్మ ప్రొడక్షన్కు చెందిన మాజీ ఉద్యోగి క్షితిజ్ ప్రసాద్ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్కు సంబంధించిన వ్యక్తిని 23వ వ్యక్తిగా కూడా అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.