Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆర్టికల్ 370 రద్దు: ఇండియన్ సినిమాలపై పాకిస్థాన్లో నిషేదం
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం విషయంలో 70 ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ఇండియాతో సంబంధాలను తెంచుకుంది. ఇందులో భాగంగా భారతీయ సినిమాలపై కూడా నిషేధం విధించింది.
అయితే భారత సినిమాలపై నిషేదం విధించడం ద్వారా నష్టపోయేది పాకిస్థానే అని అంటున్నారు విశ్లేషకులు. దీని వల్ల పాకిస్థాన్కు ఎంటర్టెన్మెంట్ టాక్స్ రూపంలో వచ్చే దాదాపు రూ. 100 కోట్లకు గండి పడబోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపబోదుని అంటున్నారు. మరో వైపు భారత్లో పాకిస్థాన్ నటీనటులపై ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడి తర్వాత నుంచే ఈ నిషేదం కొనసాగుతోంది.
ఆర్టికల్ 370 అనేది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, దీన్ని సాకుగా చూపి భారత్తో సన్నిహిత సంబంధాలను తెంచుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని విదేశాంగ శాఖ పాకిస్థాన్కు సూచించింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనవసరంగా తలదూర్చాలని చూస్తోందని హెచ్చరించింది.